ర్యాంప్వాక్, ప్రత్యేక ఆకర్షణగా శ్రద్ధాదాస్ (పిక్చర్స్)
హైదరాబాద్: కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ ఇండియా గుజరాతీ పోటీలు హైదరాబాద్ నగరంలో ఘనంగా ముగిశాయి. ఫిలింనగర్లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఫైనల్స్లో హైదరాబాద్తో పాటుగా చెన్నై, కోల్కతా, జంషెడ్పూర్, బెంగళూరు నగరాల్లో విజయం సాధించిన 17 మంది మిస్ టైటిల్కు, 18 మంది మిసెస్ టైటిల్కు పోటీపడ్డారు.
పూర్తిగా సాంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో జరిగిన ఈ పోటీల్లో మిస్ ఇండియా గుజరాతీగా వైశాలీ పటేల్ నిలిస్తే ద్వితీయ, తృతీయ స్థానాల్లో కృషిత అద్హి, అస్నా షా నిలిచారు. మిసెస్ ఇండియా గుజరాతీ టైటిల్ను హీనా బేడా గెలుచుకోగా తరువాత స్థానాల్లో నిషా గాలా, అపూర్వ షా నిలిచారు.
కాగా రేయ్ చిత్రం బృందం పోటీలకు హాజరై సందడి చేశారు. కథానాయకుడు సాయి ధరమ్ తేజ్, నాయికలు శ్రద్ధాదాస్, సయామీ ఖేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోటీల్లో పాల్గొన్న యువతులు, మహిళలు ర్యాంపుపై హొయలుపోతూ అందర్నీ అమితంగా ఆకట్టుకున్నారు. పోటీల్లో పాల్గొన్న యువతులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి.
ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా సూరజ్ థాపర్ (నటుడు), రిచా శర్మ (మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ -2011), నీలం ఆష్లే (డిజైనర్), దీనాజ్ (ఫిట్నెస్ ఎక్స్పర్ట్), హరీష్కుమార్ (నీరూస్), మనిలాల్ (రిపోర్టర్, జన్మభూమి) వ్యవహరించారు. గుజరాతీ మహిళల ప్రతిభను వెలికి తీసే రీతిలో జరిగిన ఈ పోటీలను వచ్చే సంవత్సరం కూడా మరింత ఘనంగా నిర్వహించడంతో పాటుగా మరిన్ని నగరాలకు విస్తరించనున్నామని నిర్వాహకులు మీనల్ వఖారియా పేర్కొన్నారు.
విజేతలు
కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ ఇండియా గుజరాతీ పోటీలు హైదరాబాద్ నగరంలో ముగిశాయి. పూర్తిగా సాంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో జరిగిన ఈ పోటీల్లో మిస్ ఇండియా గుజరాతీగా వైశాలీ పటేల్ నిలిస్తే తరువాత స్థానాల్లో కృషిత అద్హి, అస్నా షా నిలిచారు.
ఆకట్టుకున్న ప్రదర్శన
కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ ఇండియా గుజరాతీ పోటీలు హైదరాబాద్ నగరంలో ముగిశాయి. ఈ సందర్భంగా యువతులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఆనందం
కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ ఇండియా గుజరాతీ పోటీలు హైదరాబాద్ నగరంలో ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన యువతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆదరగొట్టిన ర్యాంప్వాక్
కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ ఇండియా గుజరాతీ పోటీలు హైదరాబాద్ నగరంలో ముగిశాయి. ఈ సందర్భంగా యువతులు చేసిన ర్యాంప్ వాక్ విశేషంగా ఆకట్టుకుంది.
ర్యాంప్ షో
కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ ఇండియా గుజరాతీ పోటీలు హైదరాబాద్ నగరంలో ముగిశాయి. ఈ సందర్భంగా ర్యాంప్ వాక్ చేస్తున్న యువతి.
శ్రధ్ధాంనందం
కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ ఇండియా గుజరాతీ పోటీలు హైదరాబాద్ నగరంలో ముగిశాయి. కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్ నటి శ్రద్ధాదాస్ చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం.
సాయి ధరమ్ తేజ్
కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ ఇండియా గుజరాతీ పోటీలు హైదరాబాద్ నగరంలో ముగిశాయి. కార్యక్రమానికి హాజరైన రేయ్ చిత్రం బృందం సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న కథానాయకుడు సాయి ధరమ్ తేజ్.
నాయికలతో సాయి ధరమ్ తేజ్
కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ ఇండియా గుజరాతీ పోటీలు హైదరాబాద్ నగరంలో ముగిశాయి. కార్యక్రమానికి హాజరైన రేయ్ చిత్రం బృందం సందడి చేశారు. కథానాయకుడు సాయి ధరమ్ తేజ్, నాయికలు శ్రద్ధాదాస్, సయామీ ఖేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అలరించిన ర్యాంప్వాక్
కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ ఇండియా గుజరాతీ పోటీలు హైదరాబాద్ నగరంలో ముగిశాయి. ఈ సందర్భంగా యువతులు చేసిన ర్యాంప్ వాక్ విశేషంగా ఆకట్టుకుంది.