బిసిలతో తగాదాలు పెట్టాలని.. బీసీ కోటాలో వద్దు: ముద్రగడ
తమకూ బీసీలకు మధ్య తగాదాలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నిస్తోందని, తాము బీసీ కోటాలో రిజర్వేషన్లు తీసుకోబోమని ముద్రగడ పద్మనాభం అన్నారు.
రాజమహేంద్రవరం: బీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే తీసుకోబోమని, తమకు ప్రత్యేకంగా రిజర్వేషన్ల కోటా కేటాయించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. బీసీలుకు, కాపులకు మధ్య తగాదా పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తాము ఇక ఐక్యంగా ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.
మంజునాథ కమిషన్కు వినతిపత్రా లు ఇవ్వడానికి కాపులకో రోజు, బీసీలకో రోజు కేటాయించాలని అడుగుదామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. తన అనుచరులతో కలసి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు ఇంటిలో వివిధ బీసీ సంఘాలతో సమావేశమయ్యారు.

వారితో చర్చలు జరిపిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులను బీసీలలో చేర్చితే ప్రస్తు త బీసీలకు నష్టం జరుగుతుందేమోననే అనుమానం ఉందని, అందువల్ల వారి అనుమానాలు నివృత్తి చేయడానికి బీసీ నేతల ఇంటికి వెళుతున్నానని ఆయన చెప్పారు.
తొలుత బీసీసంక్షేమ సంఘం జా తీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డిని కలిస్తే పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ పిల్లి సుభా్షచంద్రబోస్, మార్గాని నాగేశ్వరరావు వంటి నేతలు అటువంటి అభ్యంతరాలే వ్యక్తం చేశారన్నారు.
వాస్తవానికి బీసీలు పొందుతున్న రిజర్వేషన్లు తమకు అవసరం లేదని, వాటిని ఇచ్చినా తాము తీసుకునేది లేదని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు అదనంగా పెంచి, వర్గీకరణలో తమకు ఓ గ్రూపు కేటాయించాలని మాత్రమే ఉద్యమిస్తున్నామని ఆయన అన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications