వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపులతో చంద్రబాబు మైండ్‌గేమ్, దేశంలో ఎక్కడ లేవు: ముద్రగడ ఆవేదన

కాపు ఉద్యమనాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుజాతితో చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రల

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: కాపు ఉద్యమనాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుజాతితో చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

Mudragada lashes out at Chandrababu

కాపు ఉద్యమం ప్రారంభం నాటి నుంచి తమ అనుకూల పత్రిక, ఛానళ్ల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేక వార్తలు రాయిస్తోందని గురువారం విడుదల చేసిన బహిరంగ లేఖలో ఆరోపించారు. తనను దూషించడానికి కొంత మంది పెద్దల్ని, కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

ఒక కులాన్ని అదే కులస్తులతో తిట్టించిన ఘటనలు దేశంలో ఎక్కడా లేవని ముద్రగడ వాపోయారు. ఉద్యమంలో కాపు కులస్తులు అలసిపోతున్నారని, మరికొంత వారి బంధువుల వ్యాపారాల వల్ల ప్రభుత్వంలో చేరుతున్నారని అన్నారు. ఎన్నిక ఆటంకాలు ఎదురైనా ఉద్యమం కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.

English summary
Former minister Mudragada Padmanabham on Thursday lashed out at AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X