చంద్రబాబుకు ముద్రగడ డెడ్ లైన్: ఆలోగా స్పందించకపోతే మరో ఉద్యమమే!
ఎన్నికల హామిలను నిలబెట్టుకోని వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు ఈ విషయం గుర్తెరిగి వ్యవహరించాలన్నారు.
అమరావతి: కాపులకు రిజర్వేషన్ అంశంపై ఇప్పటికే ఓ దఫా ఉద్యమం ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరో పోరుకు సన్నద్దం అవుతున్నారు. మే 7వ తేదీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన ఆయన.. ఆలోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
మే 7వ తేదీన సీఎం చంద్రబాబు నుంచి గనుక ప్రకటన రాకపోతే.. అదే రోజు కాపు జేఏసీ నేతలతో సమాలోచన జరిపి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ముద్రగడ అన్నారు. ఒకవేళ కాపు రిజర్వేషన్లపై సీఎం నుంచి చర్చలకు ఆహ్వానం లభిస్తే... తమ తరుపున ఐదుగురిని చర్చలకు పంపుతామని అన్నారు.

తన అనుభవాన్నంతా ఉపయోగించి మరీ చంద్రబాబు ఉద్యమాన్ని అణచివేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో కాపు సోదరులంతా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. అదే సమయంలో ఇటీవల సుప్రీం కోర్టు చేసిన ప్రకటనను ముద్రగడ గుర్తుచేశారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications