వివాహేతర బంధం?: బ్యూటీషియన్ కాళ్లు, చేతులు కట్టేసి కత్తులతో దాడి చేశారు
విజయవాడ: కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యూటిషియన్పై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు దుండగులు. ఆమె చేతులను నరికేశారు.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉంటే స్థానికులకు గమనించి ఆమెను హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని పద్మగా పోలీసులు గుర్తించారు.

అయితే, బ్యూటిషియన్ పద్మ గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటూ.. ప్రసాద్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ యువకుడితోనే బాపుల పాడులో నివాసముంటోంది.
ఈ క్రమంలోనే ఆమెపై హత్యాయత్నం జరగడంతో.. యువకుడితో వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని బంధువులతోపాటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడే దాడి చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications