చంద్రబాబుతో కెసిఆర్ సన్నిహితుడు మైహోం రామేశ్వర రావు ముచ్చట్లు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి కుమారుడి వివాహంలో టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మైహోం రామేశ్వర రావు మాట కలిపారు.
రావుల తనయుడి వివాహం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. నూతన వధూవరులను చంద్రబాబు ఆశీర్వదించారు.

ఈ వివాహానికి టిడిపికి చెందిన ఇరు రాష్ట్రాల నేతలు, బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సన్నిహితుడిగా పేరుపడ్డ మైహోం గ్రూప్ రామేశ్వర రావు కూడా హాజరయ్యారు.
చంద్రబాబు, రామేశ్వర రావులు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీరు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు. పెళ్లి కారణంగా వీరు కలిశారు. మరోవైపు, ఈ వేడుకకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!











Click it and Unblock the Notifications