దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం: ఏపి, టిలపై మైసూరా
హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టు రాజకీయ దురుద్దేశంతోనే చేపడుతోందని అన్నారు.
విభజన చట్టాన్ని ఇరు రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కృష్ణా రివర్ బోర్డు, సిడబ్ల్యూసి అనుమతి తీసుకోవాలన్నారు. పట్టిసీమ విషయంలో ఏపి ప్రభుత్వం సిడబ్ల్యూసి అనుమతి తీసుకుంటే బాగుండేదని మైసూరా అన్నారు.

అయితే ఏపి సిఎం చంద్రబాబునాయుడు అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఇద్దరు సిఎంలు వ్యవహరించడం తగదన్నారు.
అనుమతుల్లేని ప్రాజెక్టు నిర్మాణాలపై కేంద్ర జలవనరుల శాఖ, సిడబ్ల్యూసికి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తారని చెప్పారు. చట్టాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవించాలన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications