దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం: ఏపి, టిలపై మైసూరా
హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టు రాజకీయ దురుద్దేశంతోనే చేపడుతోందని అన్నారు.
విభజన చట్టాన్ని ఇరు రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కృష్ణా రివర్ బోర్డు, సిడబ్ల్యూసి అనుమతి తీసుకోవాలన్నారు. పట్టిసీమ విషయంలో ఏపి ప్రభుత్వం సిడబ్ల్యూసి అనుమతి తీసుకుంటే బాగుండేదని మైసూరా అన్నారు.

అయితే ఏపి సిఎం చంద్రబాబునాయుడు అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఇద్దరు సిఎంలు వ్యవహరించడం తగదన్నారు.
అనుమతుల్లేని ప్రాజెక్టు నిర్మాణాలపై కేంద్ర జలవనరుల శాఖ, సిడబ్ల్యూసికి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తారని చెప్పారు. చట్టాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవించాలన్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications