ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం నాబార్డ్ భారీ రుణం మంజూరు
Recommended Video

అమరావతి: జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్(నాబార్డ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ సాయాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ నీటి వనరుల అభివృద్ధి సంస్థ(ఏపీడబ్ల్యూఆర్డీసీ)కి నాబార్డ్ రూ. 1,931 కోట్ల రుణం మంజూరు చేసింది.
చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేయడానికి నాబార్డ్.. ఏపీడబ్ల్యూఆర్డీసీకి ఇన్ఫ్రాక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్(ఎన్ఐడీఏ) కింద మంజూరు చేసిందని నాబార్డ్ ఏపీ ప్రాంతీయ కార్యాలయం సీజీఎం ఎస్ సెల్వరాజ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

చింతలపూడి పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలోని 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 18 మండలాల్లోని 410 గ్రామాలు ఉన్నాయని ఆ ప్రకనటలో వెల్లడించారు. ఈ పథకం ద్వారా 4.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్ పంటలకు మూడు దశల్లో 53.50 టీఎంసీల సాగునీటి వసతి కలుగుతుందని వివరించారు.
అంతేగాక, జల్లేరు వద్ద 14 టీఎంసీల సామర్థ్యం గల తాగునీటి రిజర్వాయర్ ద్వారా ప్రాజెక్టు గ్రామాల్లో 26 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పించే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు మార్చి 22 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సదరు ప్రకటనలు పేర్కొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications