ఏపీలో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాక ఆ పని చేస్తాం.. టీటీడీపైనా నాగబాబు సంచలనాలు!!
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే ఎప్పుడూ హాట్ హాట్ గానే సాగుతున్నాయి. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల దాడి పెంచుతున్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్దారు అన్నది ఏపీలో తరచుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇక ఈ క్రమంలో సీఎం ఎవరు అన్నది కూడా ఆసక్తికర చర్చకు కారణం గా మారింది.
వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చేస్తామని జనసేన ఆవిర్భావ సభ వేదికగా ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ ఇక రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో కచ్చితంగా అధికారం చేపడతామని పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం సుగాలి ప్రీతి వ్యవహారంపై చేస్తానని, తర్వాత కౌలు రైతుల ఆత్మహత్యల నివారణ కోసం సంతకం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక మార్లు తన సభలలో ప్రస్తావించారు.

ఇక తాజాగా మరోమారు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతారని నాగబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖలలో జవాబుదారీతనం తీసుకురావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ పని చేస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా అన్ని శాఖల్లోనూ పనితీరు మెరుగు పడేలా నిర్ణయాలు ఉంటాయన్నారు.

ఈ సమయంలో టీటీడీ ఆస్తుల పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగబాబు స్వయం పాలక క్షేత్రంగా టీటీడీ ఉండాలనేది కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆలయానికి చెందిన ఆస్తులన్నీ అందినంత వరకు దోచుకుంటున్నారని విమర్శలు చేశారు.కాగితాలకే పరిమితం అయిన స్వయం ప్రతిపత్తి గురించి బహిరంగ చర్చ జరగాలన్న నాగబాబు కచ్చితమైన జవాబుదారీతనం ఉండాలన్నారు.
జవాబుదారీతనం సీఎం పవన్ అన్ని శాఖల్లో తీసుకువస్తారన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జనసేన ప్రభుత్వంలో విభిన్న వర్గాల వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తామని నాగబాబు వెల్లడించారు.మొత్తంగా పవన్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతారని, అలాగే పవన్ సీఎం అవుతారని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.












Click it and Unblock the Notifications