పవన్ ,బాలకృష్ణ కలిసున్న ఫోటో షేర్ చేసిన నాగబాబు ... బాలయ్య విషయంలో యూటర్న్?
జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లు కలిసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలకృష్ణపై విరుచుకుపడిన నాగబాబు 2019 ఎన్నికలకు ముందు నుంచే బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు . పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే నాగబాబు బహిరంగంగానే బాలయ్య పై విరుచుకుపడ్డారు.

నిన్నటి దాకా బాలకృష్ణ ను టార్గెట్ చేసిన నాగబాబు తాజా ఆసక్తికర పోస్ట్
ఇటీవల కరోనా సమయంలో సినిమా షూటింగ్లకు అనుమతుల విషయంలో బాలకృష్ణను సినీ పెద్దలు ఆహ్వానించకపోవడం పై బాలయ్య విరుచుకుపడ్డారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన సమయంలో చిరంజీవి నాగార్జున తదితరులు హాజరు కావడంపై బాలయ్య విమర్శలు గుప్పించారు. దీంతో బాలకృష్ణ ని టార్గెట్ చేసిన నాగబాబు ఆయన పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గా బాలకృష్ణ రాజకీయాలలో రెండు వేర్వేరు పార్టీలలో ఉన్నారు. అటువంటి వారిని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు.

పవన్ , బాలయ్య కలిసున్న ఫోటో షేర్ .. బ్రదర్స్ టూ గెదర్ అంటూ పోస్ట్
నాగబాబు ప్రస్తుతం యు టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ కలిసి ఉన్న ఒక పాత ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన నాగబాబు తన వద్ద అలాంటి ఫొటోలు చాలానే ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. ఫోటోలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఈ ఫోటో పై వ్యాఖ్యలు చేసిన నాగబాబు బ్రదర్స్ టుగెదర్.. ఒకరు సొంత తమ్ముడు మరొకరు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని రాసుకొచ్చారు.

బాలయ్యను సోదరుడు అంటూ పేర్కొన్న నాగబాబు
ఇద్దరు సోదరులు కలిసిన వేళ ఒకరు నా సొంత సోదరుడు కాగా, మరొకరు నాకు లభించిన సోదరుడు అంటూ పవర్ స్టార్ నందమూరి సింహాన్ని కలిసిన రోజు అంటూ పోస్ట్ పెట్టారు నాగబాబు.
ఇదే ఫొటోకు మేము సినిమాను ప్రేమిస్తాము. ఆ తరువాతే ఏదైనా అని మరో కామెంట్ని జత చేశారునాగబాబు . ప్రస్తుతం నాగబాబు పోస్ట్ వైరల్ గా మారింది. నిన్న మొన్నటి దాకా బాలకృష్ణ మీద నిప్పులు చెరిగిన నాగబాబు ఒక్కసారిగా బ్రదర్ అండ్ కూల్ గా పోస్ట్ పెట్టడం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Recommended Video

నాగబాబు యూ టర్న్ తీసుకున్నారా ? మరి ఏమై ఉంటుందో
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు చాలా రోజుల తర్వాత ఆసక్తికర పోస్ట్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇక నాగబాబు వ్యాఖ్యల వెనక కారణం ఏమై ఉంటుందా అని ఈ పోస్టు చూసిన వారంతా తెగ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
నందమూరి ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడుతున్నారు. మొన్నటి దాకా విమర్శలు చేసిన నాగబాబు ఒక పాజిటివ్ పోస్ట్ పెట్టటంతో నాబబు పోస్ట్ పై కూడా పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు .
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications