15 రోజుల్లో పెళ్ళి అనుమానాస్పదస్థితిలో వరుడు మృతి
మరో పదిహేను రోజుల్లో వివాహం. పెళ్ళికి సంబంధించిన ఆహ్వన పత్రికలను పంచేందుకు వెళ్ళిన పెళ్ళికొడుకు రైల్వే ట్రాక్ పై శవంగా మారాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది..
గుంతకల్లు: మరో పదిహేను రోజుల్లో వివాహం. పెళ్ళికి సంబంధించిన ఆహ్వన పత్రికలను పంచేందుకు వెళ్ళిన పెళ్ళికొడుకు రైల్వే ట్రాక్ పై శవంగా మారాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది..
అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అరుణ, నాగయ్య దంపతుల రెండో కుమారుడు నాగార్జున అలియాస్ ఇజ్రాయిల్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

నాగార్జునకు ఈ మధ్యనే హావళిగి గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల 3, 4 తేదిల్లో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కసాపురంలో పెళ్ళి జరగాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రి పని నిమిత్తం తిరుపతికి వెళ్ళొస్తానని చెప్పి ఇంటి నుండి వెళ్ళిన నాగార్జున బుదవారం ఉదయం గుంతకల్లు సమీపంలో రైల్వే ట్రాక్ పై మృతదేహమై పడి ఉన్నాడు.
రైలు కింద పడి మరణించడంతో కుటుంబసభ్యులు గుండలవిసేలా రోధిస్తున్నారు. నాగార్జున ప్రమాదవశాత్తు మరణించాడా లేక ఆత్మహత్య చేసుకొన్నాడా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్ పీ పోలీసులు చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications