Nagarjunasagar Dam: సీఆర్పీఎఫ్ దళాల పహారాలో డ్యామ్; కేంద్ర హోంశాఖ నిర్ణయం!!
నాగార్జునసాగర్ జల జగడం చిలికి చిలికి గాలి వానగా మారుతుంది. ఇప్పటికే నాగార్జునసాగర్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పట్టిన పట్టు వదలకుండా భీష్మించుకు కూర్చోవడంతో ఈ వ్యవహారంపై కేంద్రం దృష్టిసారించింది. నాగార్జునసాగర్ జలాల విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.
దీంతో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో శుక్రవారం కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ, నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించాలని సూచించారు.

అంతేకాదు సిఆర్పిఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రతిపాదించారు .ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. నవంబర్ 29వ తేదీ రాత్రి ఏపీకి చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం పైకి వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ డ్యాం యొక్క 5, 7 గేట్లు తెరిచి, దాదాపు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, తెలంగాణ సిఎస్ శాంతకుమారి కేంద్ర హోం శాఖకు వెల్లడించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం చేసిన ఈ చర్య సమస్యను సృష్టించిందని ఆమె పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ఈ తరహాలో అతిక్రమణలకు పాల్పడడం ఇది రెండవసారి అని శాంత కుమారి స్పష్టం చేశారు. ఏపీ చేసిన ఈ పనితో హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన రెండు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని ఆమె వెల్లడించారు. 2014 నుంచి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్ కో ని కొనసాగించాలని తెలంగాణ cs శాంతకుమారి కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications