కుప్పంలో ఒకే రోజు 7 ప్రాజెక్ట్ లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
కుప్పంలో సీఎం చంద్రబాబు ఒకే రోజు ఏడు సంస్థలకు శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రూ. 2,203 కోట్ల పెట్టుబడితో కుప్పంలో పలు సంస్థల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
"పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నాం. ఎస్ఐబీపీల ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన ఆమోదం తెలుపుతున్నాం. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎరో స్పేస్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నాం. డ్వాక్రా వ్యవస్థను ప్రారంభించాం. ఇప్పుడు ఆ వ్యవస్థ పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించగలుగుతోంది. మెరుగైన జీవన ప్రమాణాలు ఉండేలా చూసుకోవాలి. ఒకప్పుడు కుప్పం అత్యంత వెనుకబడిన ప్రాంతం.. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇప్పుడు హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E-Royce EV, ALEAP మహిళా పార్క్ వచ్చాయి" అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
" ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. కుప్పంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాం. హిందాల్కో సంస్థ మొబైల్, ల్యాప్ టాప్, టెక్ పరికరాల భాగాల తయారీలో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కుప్పంలో రూ.586 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఆదిత్య బిర్లా సంస్థ స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇస్తుంది. దీని వల్ల స్థానిక యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. శ్రీజా డైరీ.. సమీకృత డెయిరీ, పశువుల మేత ప్లాంటును. రూ.290 కోట్లతో ప్రాజెక్టు చేపడుతోంది. మహిళలకు ఉపాధి, పాడి రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది" అని సీఎం చంద్రబాబు తెలిపారు.
"నాలుగు లక్షల లీటర్లను శ్రీజా డెయిరీ కొనుగోలు చేస్తుంది. అలాగే స్థానిక పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ... డెయిరీ ప్రోటీన్ తయారీలో ప్రపంచ ప్రమాణాలను పాటించే సంస్థ. ఎగుమతుల హబ్ గా కుప్పాన్ని తీర్చిదిద్దే సామర్ధ్యం ఈ సంస్థకు ఉంది. గ్రీన్ ఫీల్డ్ డెయిరీ ఉత్పత్తుల కాంప్లెక్స్ ను రూ.525 కోట్లు పెట్టుబడితో స్థాపించేందుకు కుప్పానికి వచ్చింది. SVF సోయా సంస్థ వంట నూనెల తయారీ, సోయా ప్రోటీన్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. 2 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుంది... దీని కోసం మొత్తం రూ.373 కోట్లు వ్యయం చేయనుంది. మదర్ డైరీ సంస్థ జ్యూస్, జాం, పల్ప్ యూనిట్ తో పండ్ల రైతులకు ప్రపంచ మార్కెట్ పరిచయం చేస్తుంది. రూ.260 కోట్లు పెట్టుబడి పెట్టనుంది" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
"E-Royce EV సంస్థ ఎలక్ట్రిక్ ఆటోలు, బైకులు తయారు చేసే ఈ సంస్థ... అడ్వన్స్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కేంద్రాన్ని రూ.200 కోట్లతో కుప్పంలో ఏర్పాటు చేస్తోంది. ALEAP మహిళా పార్క్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా రూ.27 కోట్లతో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్క్ అభివృద్ధి చేస్తోంది. అలీప్ నిర్మించే మహిళా శక్తి భవన్ తో 4,000 మహిళలకు ఉపాధి, శిక్షణ లభిస్తుంది. ఈ కంపెనీల రాకతో ఈ ప్రాంతం ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 22,330 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ ఏడాదిలో డ్వాక్రా, మెప్మా సంఘాల నుంచి లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
"పబ్లిక్ పాలసీలతో చరిత్రను తిరగరాయవచ్చు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్, వన్ ఫ్యామిలీ-వన్ ఏఐ నిపుణుడు అనే పాలసీలు చరిత్రను తిరగరాస్తాయి. స్థానిక ఉత్పత్తులను.. స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకునే అవకాశాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నా. కుప్పం నియోజకవర్గాన్ని 100 శాతం సోలార్ పవర్ వినియోగించుకునే నియోజకవర్గంగా చేయాలనుకుంటున్నాం. తమిళనాడు, కర్ణాటకలకు అనుసంధానంగా కుప్పం ఉంది. ఇక్కడ మౌళిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. కుప్పం నుంచి వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. కుప్పానికి జాతీయ రహదారులు, రైల్వే అనుసంధానం ఉంది. ఎయిర్ కనెక్టివిటీ పెంచేలా చూస్తున్నాం" అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

"మరో 8 పరిశ్రమలు త్వరలో కుప్పానికి రాబోతున్నాయి. త్వరలో రూ.6,339 కోట్ల పెట్టుబడితో 8 సంస్థలు కుప్పానికి రానున్నాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 43 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బ్యాటరీ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫుడ్ లాజిస్టిక్స్, ఫుట్ వేర్, ఇన్నోవేషన్ హబ్ గా కుప్పం రూపుదిద్దుకోనుంది. సంక్షేమం అమలు చేస్తున్నాం. వంద శాతం దీపం కనెక్షన్లు ఇచ్చాం. 1,291 కుటుంబాలకు LPG కనెక్షన్లు ఇచ్చాం. 37,324 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 42,232 మంది విద్యార్థుల తల్లులకు తల్లకి వందనం అందించాం. పీ4 కింద 7,401 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చేశాం. 7,489 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. 5 లక్షల లీటర్ల పాలు కుప్పంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతోంది. ఇది 10 లక్షలకు చేరాలి. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు... ఇలా అందరి నమ్మకాలను నిజం చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును తొలిసారి కుప్పంలోనే అమలు చేశాం. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలి. కుప్పానికి కరవును దూరం చేసేలా 700 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి హంద్రీనీవా ద్వారా నీళ్లు తెచ్చాం. కుప్పంలో తాగు, సాగు నీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు పుష్కలంగా లభించనుంది" అని సీఎం చంద్రబాబు తెలిపారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications