అమరావతికి అదిరిపోయే న్యూస్ చెప్పిన బాలకృష్ణ..!
ఏపీలో అమరావతి రాజధానికి హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. ఐదేళ్లుగా మూలనపడిన అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతున్న వేళ.. తన వంతుగా ఏం చేస్తారో ఆయన చెప్పేశారు. ఇవాళ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో అంకాలజీ యూనిట్ ప్రారంభించిన బాలయ్య.. తన మనసులో మాట చెప్పేశారు.
అమరావతి రాజధానిలో గతంలో స్థలాలు కేటాయించిన సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అప్పట్లో వారితో చేసుకున్న ఒప్పందాల గడువు ముగిసిపోవడం, ఇందులో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో తిరిగి వారిని తీసుకొచ్చేందుకు అధికారుల స్ధాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాను ఛైర్మన్ గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి బ్రాంచ్ ను అమరావతిలో పెట్టేందుకు గతంలో బాలయ్య అంగీకరించారు.

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించిన సంస్థలతో సంప్రదింపులు జరిపి వారితో తిరిగి ఆయా సంస్థలు పెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బాలయ్యను కూడా సంప్రదించి ఆయన సారధ్యంలో నడుస్తున్న హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి బ్రాంచ్ ను అమరావతిలో పెట్టేలా ఒప్పించారు. దీంతో 8 నెలల్లో అమరావతిలో ఈ ఆస్పత్రి బ్రాంచ్ ఏర్పాటు చేస్తానని బాలయ్య ఇవాళ హైదరాబాద్ లో ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా పేదలకు చౌకగా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!












Click it and Unblock the Notifications