నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్: ఆరోగ్యంగానే ఉన్నానంటూ వెల్లడి, వారికి సూచన
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా, చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంచుకుంటున్నారు. కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతో కలిసి బాలకృష్ణ పాల్గొన్న విషయం తెలిసిందే. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం సుమారు 500 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల వ్యాప్తి కొంత నియంత్రణలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బాలకృష్ణ విషయానికొస్తే ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పవర్ఫుల్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ విభిన్న కథతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. దీంతో పాటు వ్యాఖ్యతగానూ బాలకృష్ణ అలరించనున్నారు. అన్స్టాపబుల్ సీజన్-2 త్వరలో ప్రారంభం కానుంది. కాగా, ఇటీవల విడుదలైన అఖండ చిత్రంతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.