నంద్యాలపై వ్యూహాలు: శిల్పాకు చెక్ చెప్పేందుకు అఖిలప్రియ ఇలా..
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపు కోసం వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు.
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపు కోసం వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు.
వారికి నోటీసుల షాక్: రెండేళ్ల పదవికి ఆశపడి శిల్పా ఆఫర్ మిస్ చేసుకున్నారా?
నంద్యాల ఉప ఎన్నికను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రజల్లోకి వెళ్తున్నాయి. భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని కోరుతూ టిడిపి నంద్యాలలో సరికొత్త యాత్రకు సిద్ధమైంది.
టిడిపి సరికొత్త యాత్ర!
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆశీర్వాద యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మనంద రెడ్డి, వైసిపి తరఫున మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు.
నువ్వా.. నేనా అన్నట్లుగా..
అయితే, ఇంకా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడకముందే కర్నూలు జిల్లా రాజకీయాల్లో వాతావరణం వేడెక్కింది. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ప్రస్తుతం నంద్యాలలో నువ్వా నేనా అన్నట్లుగా పరిస్ధితి ఉందని అంటున్నారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి సారించారు.
ఇప్పటికే చంద్రబాబు, నారాయణ పర్యటనలు
ఇటీవల సీఎం చంద్రబాబు ఇప్తార్ విందు పేరుతో నంద్యాలలో పర్యటించారు. మంత్రి నారాయణ కూడా రెండుసార్లు నంద్యాలను చుట్టివచ్చారు.
అఖిల - శిల్పాల సవాళ్లు, ప్రతి సవాళ్లు
ఇక స్థానికంగా మంత్రి భూమి అఖిలప్రియ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. తన సోదరుడిని గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డికి సవాల్ కూడా విసిరారు. నంద్యాలలో టిడిపి ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అఖిల సవాల్ విసిరారు. శిల్పా కూడా ధీటుగానే స్పందించారు.