ఏపికి చేయూత: అమెరికాలో పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీలు(పిక్చర్స్)
న్యూయార్క్/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం నేత, పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ రెండోరోజు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై వారితో చర్చలు జరిపారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఎల్వియస్ఆర్కె ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
అమెరికా వాణిజ్యవిభాగానికి చెందిన అరుణ్కుమార్ను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు తయారీ రంగ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను మలిచే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. డైనమిక్ గ్లాస్ తయారీ సంస్థ సీఈవో డాక్టరు రావు ముల్పూరితో సమావేశమై.. రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని స్థాపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇమేజినేషన్ ప్రెసిడెంట్ కృష్ణ యార్లగడ్డను కలుసుకుని విశాఖపట్నంలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఉన్న అనుకూలతను వివరించారు. ఆ తర్వాత ఐటీ, ఐటీఈఎస్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన పలువురు పెట్టుబడిదారులతో లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఉన్న అవకాశాలను, వనరులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాభివృద్ధికి చేయూతని వ్వాల్సిందిగా కోరారు.
నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం నేత, పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ రెండోరోజు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.
నారా లోకేష్
ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై వారితో చర్చలు జరిపారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఎల్వియస్ఆర్కె ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
నారా లోకేష్
అమెరికా వాణిజ్యవిభాగానికి చెందిన అరుణ్కుమార్ను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు తయారీ రంగ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను మలిచే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.
నారా లోకేష్
డైనమిక్ గ్లాస్ తయారీ సంస్థ సీఈవో డాక్టరు రావు ముల్పూరితో సమావేశమై.. రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని స్థాపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.