హవ్వా.. అశోక గజపతిరాజుపై అవినీతి ముద్రనా..? సీఎం జగన్పై నారా లోకేశ్ నిప్పులు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. అశోక గజపతిరాజు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చేస్తోన్న రచ్చపై మండిపడ్డారు. శనివారం ట్వీట్టర్ వేదికగా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అశోక గజపతి రాజు గారి లాంటి గొప్ప వ్యక్తిపై అవినీతి ముద్ర వేయాలనుకోవడం సరికాదన్నారు. ఇది సూర్యుడిపై ఉమ్మి వేయడం లాంటిదేనని మండిపడ్డారు.

అశోక గజపతిరాజుని ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడటం జగన్ ప్రభుత్వంలోని మంత్రి అధికార మదానికి నిదర్శనం అని మండిపడ్డారు. వేల ఎకరాల భూమి, సంపదను.. మన్సాస్ ట్రస్ట్కు ఇచ్చిన గొప్ప మనిషి అశోక గజపతిరాజు అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రంలో వేల మంది విద్యార్థులకు ఉచితంగా విద్యాబుద్దులు అందిస్తూ ప్రయోజకులను చేస్తున్న ఆయనపై అవినీతి ముద్ర వేయడం మంచి పద్ధతి కాదన్నారు.
మాన్సాన్కు సంబంధించి చీకట్లో జీవో ఇచ్చి రాజకీయ క్రీడ మొదలుపెట్టారని లోకేశ్ ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ప్రారంభమైన వైసీపీ విధ్వంసకాండ సింహాచలం అప్పన్న చూస్తున్నారు అని లోకేశ్ ఫైరయ్యారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని పేర్కొన్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications