Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!!

ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమైన తల్లికి వందనం అమలు విషయంలో స్పష్టత ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గత ఏడాది విద్య సంవత్సరం ప్రారంభం వేళ అర్హులైన విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. మరోసారి వచ్చే జూన్ లో నిధులు జమ చేయాల్సి ఉంది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న వారితో పాటుగా కొత్త ఎవరికి అవకాశం దక్కేదీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించినట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అర్హులందరికీ సాయం అందించాల నేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని వెల్లడించారు. తల్లికి వందనం పథకం, యూడైస్ ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. యూడైస్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 79,51,903 మంది విద్యార్థులు నమోదయ్యారని చెప్పారు. తల్లికి వందనం పథకం కింద రూ.8,454 కోట్లు సాయం అందించాం. 67,01,653 మందికి తల్లికి వందనం అమలు చేసామని చెప్పారు యూడైస్ లో 86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటూ వైసీపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. యూడైస్ లో నమోదైన వారిలో అర్హులందరికీ(84.27%) సాయం అందించామని మంత్రి స్పష్టత ఇచ్చారు. వైసీపీ హయాంలో యూడైస్ కింద 81,72,224 మంది విద్యార్థులు నమోదై ఉంటే.. కేవలం 42,33,098 మందికి మాత్రమే, అంటే 52శాతం మందికి మాత్రమే ఇచ్చారని వివరించారు.

వాళ్లు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు - పవన్ కీలక వ్యాఖ్యలు..!!
వాళ్లు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు - పవన్ కీలక వ్యాఖ్యలు..!!
nara-lokesh-big-announcement-over-continuation-of-thalli-ki-vandanam-scheme-for-eligible-beneficiari

అర్హులైన ప్రతీ ఒక్కరికీ అమలు

తాము 85శాతం మందికి సాయం అందించామని... 2020-21 చూస్తే సుమారుగా 83 లక్షల మంది ఉంటే.. కేవలం 44 లక్షల మందికే ఇచ్చారని వెల్లడించారు. 2021-22లో 82 లక్షల మంది ఉంటే.. కేవలం 43 లక్షల మందికే ఇచ్చారన్నారు. 2022-23లో 80 లక్షల మంది ఉంటే.. కేవలం 42 లక్షల మందికే ఇచ్చారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రజా ప్రభుత్వంలో 84.27 శాతం మందికి అందజేశామన్నారు. తల్లికి వందనం పథకం కింద సాయం అందని వారి వివరాలు పంపిస్తే.. సరిచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయంగా వెల్లడించారు. కాగా, కొంతమందికి పాక్షిక సాయం అందించారనే విషయంలో.. సోషల్ వెల్ఫేర్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. మేం ముందు చెల్లించిన తర్వాత కేంద్రం నిధులు అందజేస్తోంది. రెండూ కలిసికట్టుగా అందిస్తున్నామని... గ్యాప్ ఏమైనా ఉంటే వివరాలు ఇవ్వాలని కోరారు. కాగా.. పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+