లోకేష్, బ్రాహ్మణి దంపతులకు మగశిశువు: తాతలైన బాబు, బాలయ్య
హైదరాబాద్: నారా, నందమూరి కుటుంబాలకు మన్మథసంవత్సరం ఉగాది కొత్త సంబరాన్ని తెచ్చి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు మగశశివు జన్మించాడు. హైదరాబాదులోని మాదాపూర్లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలకృష్ణ కూతురైన బ్రాహ్మణి శనివారంనాడు మగశిశువును ప్రసవించారు.
మన్మథనామ సంవత్సరం విదియ తిథిని లోకేష్, బ్రాహ్మణి దంపతులకు కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్రం రెండో పాదంలో ఆ శిశువు ఇహలోకంలోకి వచ్చాడు. కర్కాటక లగ్నం మీనరాశిగా శిశువు జననాన్ని గుర్తించారు. దీంతో నారా, నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
బ్రాహ్మణి మగబిడ్డకు జన్మనివ్వడంతో చంద్రబాబు, బాలయ్య తాతలయ్యారు. ఇరు కుంటుబాల్లోనూ వారసుడొచ్చానే ఆనందం తాండవిస్తోంది. నందమూరి, నారా వారి అభిమానులు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నాయకులు, కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటున్నారు.నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.