ఢిల్లీ లో చెయ్యండి లొల్లి, ఇక్కడ కాదు: మంత్రి లోకేష్
ప్రత్యేక హోదా పై ఆందోళన చెయ్యాలనుకునేవారు ఢిల్లీ వెళ్లి చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు.
ప్రత్యేక హోదా పై ఆందోళన చెయ్యాలనుకునేవారు ఢిల్లీ వెళ్లి చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై కొన్ని సంస్థలు మళ్లీ ఆందోళనలకు పిలుపు నివ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ ముట్టడి చేయాలనుకోవడం ఏంటని ప్రశ్నించారు. మన అసెంబ్లీని మనమే ముట్టడించడం వల్ల ఉపయోగం ఏముంటుందని లోకేష్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడ ధర్నా చేసుకోవాలని సూచన చేశారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదంటేనే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని, అందులో భాగంగానే అనంతపురానికి కియా, ఉపాధి హామీ పనుల కింద 16 వేల కోట్ల నిధులు వచ్చాయని లోకేశ్ చెప్పారు.ప్యాకేజీకి ఒప్పుకోకుంటే ఇవన్నీ ఎలా వచ్చేవని ప్రశ్నించారు. హోదా, ప్యాకేజీలపై ఏమాత్రం అవగాహన లేనివారు కూడా విమర్శలు చేస్తున్నారని లోకేష్ అన్నారు.

ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఏది రాలేదో చెప్పాలని నిలదీశారు. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను బట్టి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని ఆయన భావిస్తున్నట్లుగా అర్ధం చేసుకోవాలని పాత్రికేయులు విశ్లేషించుకున్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications