వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా: జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు, ‘మోడీకి టీడీపీ భయం’

|
Google Oneindia TeluguNews

Recommended Video

మోడీకి టీడీపీ అంటే భయం: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా'గా ఖ్యాతి గాంచిన వ్యక్తి, 13 కేసుల్లో ఏ1, కండిషనల్ బెయిల్‌పై బయట ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ పార్టీ నేరాలమయం

అంతేగాక, జగన్ పార్టీలోని నేతలంతా మర్డర్లు, కిడ్నాపులు, అత్యాచారాలు, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్, బెట్టింగ్, దోపిడీ లాంటి అన్ని నేరాల్లో ఉన్నారని తీవ్రమైన ఆరోపించారు నారా లోకేష్.

నేరాల చరిత్ర.. బాబే అణిచేశారు

ఇంత చరిత్ర ఉన్న ఆ వ్యక్తి ఏపీలోని నేరాల గురించి మాట్లాడతారంటూ జగన్మోహన్ రెడ్డి నుద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ తండ్రి హయాంలో ఉన్న క్రైమ్ రేటును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కుపాదంతో అణచివేశారని లోకేష్ ట్విట్టర్ వేదికగా చెప్పారు.

టీడీపీ అంటే కేంద్రానికి భయం

టీడీపీ అంటే కేంద్రానికి భయం

ఇది ఇలా ఉండగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీని చూస్తే భయమని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చూస్తే లోకువ అని అన్నారు. ఎందుకంటే వారిపై 12ఛార్జీషీట్లు ఉన్నాయని చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం ధీమా ఏంటి ఐదుకోట్ల మంది మనోభావాలతో ఆడుకుంటున్నారు' అని చంద్రబాబు ప్రశ్నించారు.

జగన్ పార్టీ డ్రామాలు.. మోడీ కాళ్లు పట్టుకుని..

జగన్ పార్టీ డ్రామాలు.. మోడీ కాళ్లు పట్టుకుని..

సోమవారం విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం జమ్మాదేవిపేటలో గ్రామదర్శినిలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. వైసీపీ నేతలు ఎన్నో డ్రామాలు ఆడుతున్నారని, ఢిల్లీలో మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. కష్టపడి చేసింది శాశ్వతమని, అవినీతితో సంపాదించింది అశాశ్వతమని చంద్రబాబు అన్నారు. ధర్మంగా సంపాదించాలని హితవు పలికారు. మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు నవనిర్మాణ దీక్ష చేసినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. జూన్ 2న తెలంగాణలో ఉత్సవాలు చేసుకున్నారు, కాని మనం చేసుకోవడానికి వీల్లేదని.. మనం నష్టం పోయాం.. ఐదుకోట్ల ప్రజల్లో చైతన్యం కోసమే దీక్ష చేశానని చెప్పారు.

English summary
Andhra Pradesh minister Nara Lokesh on Monday lashed out at YSRCP president YS Jaganmohan Reddy for corruption issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X