నేను ఒక్కడినే: దేవినేని అవినాశ్కు లోకేష్ హామీ, 'టచ్లో 10మంది వైసీపీ ఎమ్మెల్యేలు'
విజయవాడ: దేవినేని నెహ్రూ వ్యక్తి కాదని, ఆయన ఓ వ్యవస్థ అని ఆయన తనయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాశ్ అన్నారు. దేవినేని నెహ్రూ ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ పట్ల నెహ్రూ అంకితభావం, క్రమశిక్షణ నచ్చడం వల్లే దివంగత ఎన్టీఆర్ ఆయనను ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించారన్నారు.
Recommended Video
జనం కోసం జీవించిన నాయకుడు నెహ్రూ అన్నారు. కార్యకర్తలే శ్వాసగా తన తండ్రి బతికారన్నారు. తన తండ్రి నాడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబుతో కలిసి నడిచారని చెప్పారు. తమ కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. తనకు మంత్రి నారా లోకేష్ రాముడి లాంటి వాడని, తాను లక్ష్మణుడిలా అతని వెంట నడుస్తానని చెప్పారు.
పాదయాత్ర తర్వాత అనూహ్య నిర్ణయం, బాబుకు జగన్ షాక్: ఒక్క దెబ్బకు పవన్ కళ్యాణ్ కూడా
ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ సభ్యత్వం తీసుకున్న 10వ వ్యక్తి
తెలుగుదేశం పార్టీ బలోపేతమే ధ్యేయంగా ముందుకు సాగుతానని దేవినేని అవినాశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. దేవినేని నెహ్రూ ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా పేరొందిన ెహ్రూ 1982లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ సభ్యత్వం తీసుకున్న పదో వ్యక్తి అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారన్నారు.
నేను ఒక్కడినే.. అవినాష్కు హామీ
దేవినేని
అవినాశ్
క్రమశిక్షణ,
ఓర్పు
ఉన్న
నాయకుడు
అన్నారు.
తన
తండ్రికి
తాను
ఒక్కడినే
అని,
తన
తమ్ముళ్లుగా
దేవినేని
అవినాశ్,
చంద్రశేఖర్లకు
మంచి
రాజకీయ
భవిష్యత్తు
ఇస్తానని
నారా
లోకేష్
హామీ
ఇచ్చారు.
ఇప్పుటి
తరానికి,
ముందు
తరాలకు
దేవినేని
నెహ్రూ
గురువు
అని
దేవినేని
ఉమామహేశ్వర
రావు
అన్నారు.
టచ్లో పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో పదిమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేవినేని అవినాశ్కు సీటు కేటాయించాలని లోకేష్కు జలీల్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.
ఆ ఒకే ఒక్కడు పుస్తకం
కాగా, చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలపై కోట రమేష్ రాసిన 'ఆ ఒకే ఒక్కడు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. వారికి నారా లోకేష్ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.