విరాళాలు: నారా లోకేష్ చేతికి చెక్కులు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాలు వచ్చి పడుతున్నాయి. రాష్ట్రంలోని పలువురు దాతలు స్వచ్ఛందంగా విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా సోమవారంనాడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకరత్ నారా లోకేష్ను కలిసి విరాళాలు అందజేశారు.
చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు 5.70 లక్షల రూపాయల విరాళాలను చెక్కుల రూపంలో లోకేష్కు అందిచారు. వీరిలో తిరుపతికి చెందిన రాళ్లపల్లి సుధారాణి ఐదు లక్షల రూపాయలు, మదనపల్లికి చెందిన డాక్టర్ రాతకొండ గురుప్రసాద్ రూ. 60 వేలు, చిత్తూరు జిల్లా పీలేరువాసి షేక్ నిజాముద్దీన్ రూ. 10 వేలు విరాళాలుగా ఇచ్చారు.
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రాళ్లపల్లి వెంకటకృష్ణ చైతన్య రూ. 10116ల విరాళాలన్ని చెక్కు రూపంలో నారా లోకేష్కు అందించారు.
లోకేష్ చేతికి చెక్కులు
చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాలు అందించారు.
లోకేష్ చేతికి చెక్కులు
తిరుపతికి చెందిన రాళ్లపల్లి సుధారాణి ఐదు లక్షల రూపాయలను టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధికి బహుకరించారు.
లోకేష్ చేతికి చెక్కులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రాళ్ల పల్లి వెంకటకృష్ణ చైతన్య విరాళాలు ఇచ్చారు. చెక్కును ఆయన నారా లోకేష్ చేతికి అందించారు.
లోకేష్ చేతికి చెక్కులు
చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాలు అందించారు. లోకేష్ చెక్కుల రూపంలో విరాళాలు అందుకున్నారు.