ఈ అవకాశం అదృష్టం, అద్భుతం: పట్టిసీమలో సతీమణి బ్రాహ్మణితో నారా లోకేష్ సెల్ఫీ
అమరావతి: పోలవరం గ్యాలరీ వాక్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరు అద్భుత దృశ్యాలను తమ మొబైల్లో బంధించారు. అంతేకాదు, వారిద్దరు సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని లోకేష్ తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేసారు. వారు సెల్ఫీ తీసుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Got the chance to revisit Pattiseema, this time with @brahmaninara, and witness the beautiful sight and sound of water flowing in abundance. pic.twitter.com/ry8lG5vpqZ
— Lokesh Nara (@naralokesh) September 12, 2018
పోలవరం గ్యాలరీ వాక్కు వెళ్లిన లోకేశ్ను మీడియా పలకరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఇదొక చరిత్ర అన్నారు. భారతదేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే ఒక తరం ప్లాన్ చేస్తుందని, రెండో తరం డిజైన్ చేస్తుందని, మూడో తరంలో శంకుస్థాపన చేస్తుందని, నాలుగో తరంలో నిర్మాణం అవుతుందని, అయిదో తరంలో ప్రారంభిస్తారని, ఇలా ప్రాజెక్టులు పూర్తి కావడానికి తరాలు అవుతాయన్నారు.

కానీ కేవలం నాలుగేళ్లలోనే పూర్తి చేస్తున్నామని చెప్పారు. అధికారులు, కాంట్రాక్టర్లు అందరి సహకారం వల్ల ఈ ప్రాజెక్టు 58 శాతం పూర్తయిందని, పోలవరం ఏపీకి జీవనాడి అన్నారు. దేవుడి దయవల్ల, చంద్రబాబు దయవల్ల, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ప్రాజెక్టును సందర్శించే అవకాశం కలిగిందన్నారు. ఇలాంటి అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications