అవినీతికి పాల్పడలేదు, కాణిపాకంలో కామినేని సత్య ప్రమాణం
చిత్తూరు: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు శుక్రవారం నాడు ప్రమాణం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుండి టిడిపి వైదొలిగింది, దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడ బిజెపి మంత్రులు రాజీనామాలు చేశారు. కేంద్ర మంత్రుల రాజీనామాను రాష్ట్రపతి, రాష్ట్ర మంత్రుల రాజీనామాలు గురువారం రాత్రే ఆమోదం పొందాయి.
రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో ఉద్వేగపూరితంగా కామినేని శ్రీనివాసరావు మాట్లాడారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎవరి వద్ద నుండి ఒక్క పైసా తీసుకోలేదని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. అంతేకాదు ఈ విషయమై కాణిపాకం వరసిద్ది వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని ప్రకటించారు.

ఈ ప్రకటన మేరకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం నాడు కాణిపాకం వినాయక ఆలయంలో ప్రమాణం చేశారు. అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయడంతో తన ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు.
మంత్రి పదవిలో ఉన్న సమయంలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మరోసారి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు.ఎన్డీఏలో ఇంకా టిడిపి కొనసాగుతోందని చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే తాము రాష్ట్ర మంత్రివర్గం నుండి వైదొలిగినట్టు కామినేని శ్రీనివాస్ చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications