వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రాజధాని: 14న సీమాంధ్రలో కమిటీ పర్యటన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కమిటీ తొలిసారి రాష్ట్రంలో పర్యటించనుంది. శివరామకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ మే 14న రాష్ట్రంలో పర్యటించనుంది. రాజధాని ఎంపిక కమిటీ తొలి దశలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో పర్యటించనుంది.

రెండో దశలో ఒంగోలు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తుంది. ఈ ప్రాంతాల్లో అధ్యయనం నిర్వహించిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. అధ్యయనం కమిటీ ప్రతిపాదన ఎలా వున్నా.. సీమాంధ్రలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానిదే తుది నిర్ణయం అయ్యే అవకాశం ఉంది.

New capital selection committee arrives on May 14th

ఎంపిక కమిటీ అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతాన్ని రాజధానిగా ప్రతిపాదించే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతం రాష్ట్రంలోని మిగితా ప్రాంతాలకు దగ్గరగా ఉండే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తాగునీరుకు సమస్యలేని ప్రాంతాన్ని, భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతాన్ని రాజధానిగా ప్రతిపాదించే అవకాశం ఉంది.

మావోయిస్టుల ప్రాబల్యం, సముద్రతీరం లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. రాజధాని ఎంపిక విషయంలో ప్రజలు, పలు సంఘాల అభిప్రాయాలను కూడా ఎంపిక కమిటీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

English summary
New capital selection committee, headed by Shivaramakrishan wil arrive to the state on May 14th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X