కొత్త రాజధాని: 14న సీమాంధ్రలో కమిటీ పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కమిటీ తొలిసారి రాష్ట్రంలో పర్యటించనుంది. శివరామకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ మే 14న రాష్ట్రంలో పర్యటించనుంది. రాజధాని ఎంపిక కమిటీ తొలి దశలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో పర్యటించనుంది.
రెండో దశలో ఒంగోలు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తుంది. ఈ ప్రాంతాల్లో అధ్యయనం నిర్వహించిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. అధ్యయనం కమిటీ ప్రతిపాదన ఎలా వున్నా.. సీమాంధ్రలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానిదే తుది నిర్ణయం అయ్యే అవకాశం ఉంది.

ఎంపిక కమిటీ అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతాన్ని రాజధానిగా ప్రతిపాదించే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతం రాష్ట్రంలోని మిగితా ప్రాంతాలకు దగ్గరగా ఉండే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తాగునీరుకు సమస్యలేని ప్రాంతాన్ని, భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతాన్ని రాజధానిగా ప్రతిపాదించే అవకాశం ఉంది.
మావోయిస్టుల ప్రాబల్యం, సముద్రతీరం లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. రాజధాని ఎంపిక విషయంలో ప్రజలు, పలు సంఘాల అభిప్రాయాలను కూడా ఎంపిక కమిటీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications