అందులో తెలంగాణ సీఎం కూడా భాగస్వామే: బాంబు పేల్చిన చంద్రబాబు: రామ్ మాధవ్ ఏం చెబుతారు?
టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే తరహాలోనే మరో టాక్ షో బుల్లితెరపై సందడి చేయనుంది. హాయ్ రబ్బా స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తోన్న షో ఇది.
అమరావతి: తెలుగులో టాక్ షోల హవా నడుస్తోంది. ఇదివరకు చాలామంది ఇండస్ట్రీ పెద్దలు టాక్షోలకు హోస్ట్గా పనిచేశారు. టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే తో మళ్లీ ఈ టాక్ షోల విజృంభణ మొదలైంది. గతంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు, జూనియర్ ఎన్టీఆర్, నాని, అక్కినేని నాగార్జున, రానా, అలీ, మంచు లక్ష్మి.. తళుక్కున మెరిసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదివరకు ఓ షో కోసం హోస్ట్గా అవతారం ఎత్తారు.

ఎన్బీకేకు పోటీ..
ప్రస్తుతం- అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే, అలీతో సరదాగా టాక్ షోస్ ఆకట్టుకుంటోన్నాయి. ఇప్పుడదే లైన్ లో మరొకటి రాబోతోంది. నిజం విత్ స్మిత అనేది దీని టైటిల్. టాప్ సింగర్ హాయ్ రబ్బా స్మిత దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తోన్నారు. సోనీ లివ్ ఈ టాక్ షో ను నిర్వహిస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ ఈ నెల 10వ తేదీన సోనీ లివ్ యాప్ లో ప్రసారమౌతుంది. ఈ టాక్ షో కూడా సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలతో ముడిపడినట్టే కనిపిస్తోంది.

చంద్రబాబు, చిరంజీవి..
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు రామ్ మాధవ్.. వంటి టాప్ పొలిటీషియన్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, అడవి శేష్, నాని, రానా, సాయిపల్లవి, రాధిక, అల్లరి నరేష్, అనిల్ రావిపూడి, దేవాకట్టా, సందీప్ వంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నటులు దర్శకులు, టెక్నీషియన్స్ తో ఎపిసోడ్స్ చిత్రీకరణ కూడా పూర్తయింది. వాటికి సంబంధించిన గ్లింప్సెస్ తో కూడిన ఓ ప్రొమోను స్మిత తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తన తరువాతి ప్రాజెక్ట్ ఇదేనంటూ వెల్లడించారు.
సినిమాలతో పాటు..
చంద్రబాబు నాయుడు, చిరంజీవి, రామ్ మాధవ్ తో చిత్రీకరించిన వేర్వేరు ఎపిసోడ్స్ ఆసక్తి రేపుతోన్నాయి. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారనే విమర్శలను ఎదుర్కొంటోన్న చంద్రబాబుతో దీనికి సమాధానం చెప్పించే ప్రయత్నం చేశారు స్మిత. ఇందులో ప్రస్తుత తెలంగాణ సీఎం కూడా భాగస్వామేనని, అప్పట్లో అందరం కలిసి.. అంటూ చంద్రబాబు చెప్పడం మరోసారి వెన్నుపోటు ఉదంతాన్ని తెర మీదికి తెచ్చినట్టయింది. దీనికి చంద్రబాబు వివరణ ఇచ్చుకున్నట్టయింది.

అన్స్టాపబుల్ లో..
ఇదివరకు ఇదే వెన్నుపోటు ఉదంతంపై చంద్రబాబు.. తన బావమరిది నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో స్పందించిన విషయం తెలిసిందే. వైస్రాయ్ ఘటన ఎందుకు చోటు చేసుకోవాల్సి వచ్చిందనే విషయంపై ఆయన వివరణ ఇచ్చారు. అప్పట్లో అది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే అంశం ప్రస్తావనకు రావడం.. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రామ్ మాధవ్ ఏం చెబుతారు..?
బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు రామ్ మాధవ్ కూడా ఈ ప్రొమోలో కనిపించారు. చాలాకాలంగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారనే ప్రచారం ఉంది. పైగా ఇలాంటి టీవీ కార్యక్రమాలు, టాక్ షోలకు ఆయన హాజరు కావడం కూడా చాలా అరుదు. ఇలాంటి పరిస్థితుల మధ్య రామ్ మాధవ్ ఈ టాక్ షోలో మెరవడం ఆసక్తి రేపుతోంది. హోస్ట్ స్మిత.. ఆయనకు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? సమాధానాలను ఎలా రాబడతారనేది ఉత్కంఠతను రేపుతోంది.
-
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!











Click it and Unblock the Notifications