ప్రేమించుకున్నాం, వలీతో తాడోపేడో: నీతూ అగర్వాల్
కర్నూలు: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మస్తాన్ వలీ ఓ రియాల్టర్, నిర్మాతగానే తనకు తెలుసునని ప్రముఖ నటి, ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై బుధవారం జైలు నుండి విడుదలైన నీతూ అగర్వాల్ అన్నారు.
ఆమె కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. మస్తాన్ వలీ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తాను తాడోపేడో తేల్చుకుంటానని చెప్పారు. అతను రియాల్టర్, నిర్మాతగా మాత్రమే తనకు తెలుసునని, అంతకుమించి అతడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

తాను అతను నిర్మించిన ప్రేమ ప్రయాణం చిత్రంలో నటించానని, ఆ తర్వాత తమ మధ్య ప్రేమ చిగురించిందన్నారు. కొద్ది రోజులకు పెళ్లి చేసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత అతడు ఎక్కడి నుండి వచ్చాడు, సినీ రంగానికి ఎలా వచ్చాడు అనే అంశాలపై తాను ఏ రోజు అతడిని అడగలేదన్నారు.
తన ఏటీఎం కార్డులు కావాలని ఓ భర్తగా అతడు అడిగాడని, భార్యగా తాను ఇచ్చానని చెప్పారు. తన ఏటీఎం కార్డులను అతను దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఈ కేసులో తనను అనవసరంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. భవిష్యత్తులో తనకు సినిమా అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications