వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదు, నాయకత్వానిదే నిర్ణయం: పురంధేశ్వరి
అమరావతి: భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. జగన్తో కలిసి వెళ్లాలన్న ఆలోచన తమ పార్టీకి లేదని చెప్పారు.
పురంధేశ్వరి శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో తాము టీడీపీతో కలిసి ఉన్నామని చెప్పారు. టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. పొత్తులపై ఢిల్లీలోని అధినాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.

వైసీపీ కూడా ఎన్డీఏలో కలవబోతోందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఆ విషయంపై స్పష్టతనిచ్చారు. ఇటీవల కాలంలో బిజెపితో వైసీపీ సన్నిహితంగా ఉంటుంది. దీంతో వైసీపీ ఎన్డిఏలో చేరబోతోందనే వార్తలు వచ్చాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్థికి వైసీపీ మద్దతిచ్చింది. ఈ తరుణంలో బిజెపితో వైసీపీ కలిసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలోనే పురంధేశ్వరి చేసిన ప్రకటన రెండు పార్టీల శ్రేణుల్లో ఉన్న అనుమానాలను తీర్చింది.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications