వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసంతో ఒక్కరోజుకే, బిజెపిపై అసంతృప్తి: బాబు సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఏపీకి దక్కాల్సిన నిధుల విషయమై కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఒక్క రోజుతోనే ఈ అంశం ముగిసే అవకాశం ఉంటుందని బాబు అభిప్రాయపడ్డారు.

బిజెపితో కటీఫ్: కేంద్రం వివక్ష, రేపు అసెంబ్లీలో బాబు ప్రకటన?బిజెపితో కటీఫ్: కేంద్రం వివక్ష, రేపు అసెంబ్లీలో బాబు ప్రకటన?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని 19 అంశాలు, ఎన్నికల ప్రచారంలో మోడీ ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. టిడిఎల్పీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రంపై అనుసరిస్తున్న తీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుభవార్త: 90 శాతం నిధులిచ్చేందుకు కేంద్రం ఒకే, ప్రత్యేక హోదాపై చర్చ: హరిబాబుశుభవార్త: 90 శాతం నిధులిచ్చేందుకు కేంద్రం ఒకే, ప్రత్యేక హోదాపై చర్చ: హరిబాబు

బిజెపితో పొత్తును తెగదెంపులు చేసుకోవాలని మెజారిటీ టిడిపి ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు చంద్రబాబునాయుడు ఈ విషయమై అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

అవిశ్వాసం పెడితే ఏం ప్రయోజనం

అవిశ్వాసం పెడితే ఏం ప్రయోజనం

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఏం ప్రయోజనమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిఎల్పీ సమావేశంలో అభిప్రాయపడ్డారు.కొంద‌రు కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని అంటున్నార‌ని, తీర్మానం పెట్ట‌డానికి 50 మంది సంత‌కాలు కావాల‌ని అన్నారు. అవిశ్వాసం పెడితే ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు.

ఒక్క రోజుతోనే చర్చ ముగుస్తోంది

ఒక్క రోజుతోనే చర్చ ముగుస్తోంది


కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఒక్క రోజుతోనే చర్చ పూర్తయ్యే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అవిశ్వాసం పెడితే ఒక్క రోజుతోనే చర్చ ముగిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉండదన్నారు. ఇప్పుడున్న రెండు కేంద్ర మంత్రుల ప‌ద‌వుల్లో ఏముందని ప్ర‌శ్నించారు. అవేమ‌న్నా ప్రాధాన్యం ఉన్న ప‌ద‌వులా? అని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక హోదా విధానం

ప్రత్యేక హోదా విధానం

ప్రత్యేక హోదా విధానం నుండి తాము వైదొలిగిపోలేదని టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చెప్పారు. వరుస విజయాలతో బిజెపి క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని పయ్యావుల కేశవ్ చెప్పారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

బిజెపిపై ప్రజలు అసంతృప్తి

బిజెపిపై ప్రజలు అసంతృప్తి

ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చాలనే విషయమై బిజెపి అనుసరిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. టిడిఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేలు బిజెపసి తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

English summary
AP CM Chandrababu Naidu said that the state will not benefit with no confidence motion on union government. chandrababunaidu sensational comments on Bjp in TDLP meeting held at Amaravathi on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X