అంతా తూచ్!: టిడిపితో పొత్తుపై బిజెపి నేతల ఆసక్తికర వ్యాఖ్యలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం - బిజెపిల మధ్య పొత్తుకు త్వరలో చెల్లు చీటి పడనుందని మీడియాలో చాలా రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీని పైన బిజెపి తాజాగా స్పందించింది. ఏపీలో టిడిపితో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇది సీఎం చంద్రబాబుకు ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు.
టిడిపితో తమ పొత్తు త్వరలో ముగిసిపోతుందనేవి కేవలం ఊహాగానాలేనని చెబుతున్నారు. అలాంటి పుకార్లను నమ్మవద్దని అంటున్నారు. టిడిపితో తమ పొత్తు కొనసాగుతుందని మంత్రి కామినేని శ్రీనివాస రావు (బిజెపి ఎమ్మెల్యే), బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు తెలిపారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని, బలం పెంచుకోవాలని టిడిపి, బిజెపిలు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ధీటుగా ఎదిగేందుకు బిజెపి, మరోసారి సొంతగా గెలిచేందుకు టిడిపి పావులు కదుపుతోందని వార్తలు వచ్చాయి.

దీనిపై 'వన్ ఇండియా' ప్రతినిధితో జీవీఎల్ నరసింహా రావు మాట్లాడారు. అవన్నీ వట్టి ఊహాగానాలేనని చెప్పారు. టిడిపితో లేదా మరే పార్టీతోనైనా తమ పొత్తు కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. మంత్రి కామినేని శ్రీనివాస రావు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
టిడిపితో తమ పొత్తు కొనసాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. అయితే, రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తాము కృషి చేస్తున్నామని మంత్రి, బిజెపి నేత కామినేని చెప్పారు. ఏపీకి కేంద్రం సాయం సరిగా లేదని చెప్పడంలో మాత్రం వాస్తవం లేదన్నారు.
ఏపీకి కేంద్రం నుంచి అన్ని రకాలుగా మద్దతు ఉందని చెప్పారు. ఏపీకి కేంద్రం విభజన హామీలు నెరవేరుస్తుందని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. టిడిపి, బిజెపి మధ్య పొత్తు విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
ఇరు పార్టీల మధ్య స్నేహం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు పార్టీలు అవసరమైనంత కాలం కలిసే ఉంటాయని చెప్పారు. అయితే, ఏపీలో తమ పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. అయితే, తాము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం లేదని చెప్పారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications