కెసిఆర్ మారలేదు: మోత్కుపల్లి, ఆర్డినెన్స్పై నేతల ఫైర్
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ చేసిన ఆర్డినెన్స్ ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆ ఆర్డినెన్స్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం తగదని కెసిఆర్కు ఆయన సూచించారు.
ఇది ఇలా ఉండగా పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని టిఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్ అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కుట్రపూరితంగా వ్యవహరించి ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారని ఆరోపించారు. మరో ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని తెలంగాణ ఐటి ఉద్యోగులు కూడా వ్యతిరేకించారు.
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ చేసిన ఆర్డినెన్స్పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేస్తే తమకు అభ్యంతరం లేదని, ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉండేట్లు చూడాలని అన్నారు. పోలవరం డిజైన్ మార్చాల్సిందేనని చెప్పారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడం వెనుక ఎదో కుట్ర దాగివుందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.