ఏపీలో తిరగటానికి పాస్ లు అక్కరలేదు .. సర్కార్ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్న ఏపీ ప్రజలు
ఏపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. అంతరాష్ట్ర ప్రయాణాలకు పాసులు అసరం లేదని స్పష్టం చేసింది. అయితే కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చెయ్యాలని , అందరూ నిబంధనలను పాటించాలని షరతులు విధించింది.
Recommended Video

కరోనాతో సహజీవనం చేసే పరిస్థితిలో లాక్ డౌన్ సడలింపులు
కరోనా లాక్ డౌన్ కారణంగా కఠిన నిబంధనలు అమలు కావటంతో ఏపీలోని ప్రజలు మొన్నటి వరకు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ తో కరోనా ప్రభావం తగ్గుతుందని భావించినా కరోనా కేసులు నమోదు మాత్రం పెరుగుతూ పోతుంది. ఇక కరోనాతో సహజీవనం చెయ్యాల్సిన పరిస్థితి ఉందని , ఇప్పట్లో కరోనా తగ్గదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పేర్కొన్న నేపధ్యంలో అన్ని దేశాల్లో నిదానంగా లాక్ డౌన్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇక ఇండియాలో కూడా చాలా లాక్ డౌన్ సడలింపులు ప్రకటించింది.

ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వెళ్లాలంటే పాసులు అక్కర్లేదన్న ప్రభుత్వ నిర్ణయం
ఇక ఏపీలో కూడా లాక్ డౌన్ సడలింపులు ప్రకటించిన సర్కార్ యధావిధిగా జనజీవనం సాగించటానికి ప్రయత్నాలు చేస్తుంది .ఇక నిన్నటి దాకా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వారికి స్పెషల్ ఈ పాసులను పోలీస్ శాఖ జారీ చేస్తున్న పరిస్థితి .అయితే తాజాగా ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వెళ్లాలంటే పాసులు అక్కర్లేదని స్పష్టం చేసింది ఏపీ సర్కార్ . సొంత జిల్లాలకు వెళ్ళడానికి కూడా పాసులు తీసుకోవటం జనాలకు ఇబ్బందిగా మారింది . ప్రజలు పోలీసులకు పాసుల విషయంలో విజ్ఞప్తులు చేశారు . ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. దీంతో అంతర్ జిల్లాలకు వెళ్లాలంటే పాసులు అవసరం లేదని ఏపీ సర్కార్ పేర్కొంది . అయితే నిబంధనలు మాత్రం వర్తిస్తాయని మాత్రం చెప్తున్నారు పోలీసులు .

అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలు ..ఇతర రాష్ట్రాల వారికి పర్మిషన్ తప్పనిసరి
ఇక అంతరాష్ట్ర ప్రయాణాలకు వెసులుబాటు కల్పించామని ఇష్టారాజ్యంగా తిరిగితే ఊరుకోబోమని చెప్తున్నారు.ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఆ తరువాత బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా ఇతర రాష్ట్రాలనుండి వచ్చేవారికి మాత్రం పర్మిషన్ తప్పనిసరి అని తెలిపారు. పర్మిషన్ లేకుంటే అనుమతించేది లేదని తేల్చి చెప్పారు . వారికి ఎమెర్జెన్సీ పనుల నిమిత్తం మాత్రమే అనుమతిస్తామన్నారు. వైద్యం, మరణాలు, లాంటి అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవనున్నట్టుగా పేర్కొన్నారు పోలీసులు .
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications