పిఠాపురంలో లక్ష మెజారిటీ.. పవన్ కళ్యాణ్ గెలుపునెవరూ ఆపలేరు.. జగన్ను మించి టాప్ మెజారిటీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే.. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో రాష్ట్ర రాజకీయాలలో పిఠాపురంపైన చర్చ ఆసక్తికరంగా మారింది. ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారా? లేదా అన్న చర్చ ఏపీలో జోరుగా కొనసాగుతుంది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో స్పష్టమైన మెజారిటీతో విజయాన్ని సాధిస్తారని పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
పొత్తుతో పోటీ చేసిన జనసేన
2009లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం అప్పటి నుంచి ఇప్పటివరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘోరపరాజయం పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం కోసం టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు.

పవన్ కళ్యాణ్ మెజారిటీపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో కూటమితో ఎన్నికల బరిలోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఈసారి చాలా బలంగానే వైసిపితో యుద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ కోసం సినీ ప్రముఖులు పిఠాపురం వెళ్లి మరీ ప్రచారం చేశారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారా? ఆయనకు ఎంత మెజారిటీ వస్తుంది? అన్నదానిపైన పిఠాపురం కూటమి ఇన్చార్జ్ ఎస్ వి ఎస్ ఎన్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ ఇలా
ఒక టీవీ డిబేట్లో పాల్గొన్న ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఓట్లు పడ్డాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. పిఠాపురంలో రెండు లక్షల నాలుగు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయని, పవన్ కళ్యాణ్ కు ఒక లక్ష 50 వేల ఓట్లు వస్తాయని, మొత్తంగా ఆయన లక్ష మెజారిటీతో ఇక్కడ విజయం సాధిస్తారని వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ గారి గెలుపును ఎవరు ఆపలేరు.. రాష్ట్రంలో జగన్ రెడ్డి కన్నా ఎక్కువ మెజారిటీతో పిఠాపురం శాసన సభ్యులుగా @PawanKalyan గారు గెలవబోతున్నారు. @JanaSenaParty @JaiTDP pic.twitter.com/o9jYqDFAb4
— SVSN Varma (@SVSN_Varma) May 21, 2024
జగన్ కంటే పవన్ కే ఎక్కువ మెజార్టీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సంపాదించే నాయకులలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారని పేర్కొన్న వర్మ రాష్ట్రంలో టాప్ మెజారిటీ వచ్చేది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు మాత్రమేనని చెప్పారు. ఈసారి పవన్ కళ్యాణ్ కు వైఎస్ జగన్ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈసారి టాప్ మెజారిటీతో గెలుస్తారు
2019 ఎన్నికలలో తనకు వైఎస్ జగన్ తో సమానంగా మెజారిటీ వచ్చిందని చెప్పిన వర్మ ఈసారి పిఠాపురంలో ప్రజలు జనసేనాని పవన్ కళ్యాణ్ కు పెద్దపీట వేశారన్నారు. పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తని, ఎంతో నిజాయితీపరుడని, తాను ఆయన ఆలోచనలకు ఆకర్షితుడినయ్యానని వర్మ తెలిపారు. అందుకే ఆయనను గెలిపించే బాధ్యతను తీసుకుని అందరం కలిసికట్టుగా పని చేశామన్నారు. మొత్తంగా వర్మ మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈసారి టాప్ మెజారిటీతో గెలవబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications