ఎందుకు ఓడించామా అని ఓట్లరు బాధపడాలి, కోడి పందెలను జూదంగా మార్చొద్దు: బాబు
Recommended Video

అమరావతి: విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఛార్జీలను పెంచబోమని చెప్పిన ఏకైక రాష్ట్రం ఏపీ రాష్ట్రమేనని ఆయన గుర్తు చేశారు.. వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తాం. ఎక్కడైనా ఒకటిరెండు చోట్ల ఓడిపోతే... ఎందుకు ఓడించామా అని అక్కడి ప్రజలు బాధపడే పరిస్థితి వస్తుంది. నా కష్టానికి కూలీ ఇవ్వాలా? వద్దా? నేనడిగేది కూలీ మాత్రమేనని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో మంగళవారం నుండి జన్మభూమి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జన్మభూమి సందర్భంగా చేపట్టనున్న అంశాల గురించి ప్రస్తావించారు.
పుట్టిన గ్రామాల అభివృద్ది కోసం ఏం చేయాలో పది రోజుల పాటు ఆలోచించాలని చంద్రబాబునాయుడు ప్రజలకు సూచించారు. సంక్రాంతికి ముందు వచ్చే పండుగ జన్మభూమి అని చంద్రబాబునాయుడు చెప్పారు.

విద్యుత్ ఛార్జీలు పెంచం
విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని తేల్చి చెప్పిన ప్రభుత్వం కూడ ఏపీ ప్రభుత్వమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. విద్యుత్ సంస్కరణలపై అపోహల కారణంగా 20014 ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయినట్టు బాబు గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వం సోలార్ పాలసీని తెస్తే విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

కోడిపెందెలను జూదంగా మార్చకూడదు
కోడి పందెలను జూదంగా మార్చకూడదని చంద్రబాబునాయుడు సూచించారు.సంక్రాంతికి కోడిపందేలు ఆడవద్దనడం లేదు. కానీ... వాటికి కత్తులు కట్టొద్దు. జూదంగా మార్చవద్దు. గ్రామీణ క్రీడల సంస్కృతిని గౌరవిస్తూనే... ప్రకృతిని కాపాడాలని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

జన్మభూమిలో సమస్యలను ఆన్లైన్ లో పరిష్కారం
జన్మభూమిలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను ఆన్లైన్ లో పెట్టనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. రియల్ టైమ్ లో సమస్యలను పరిష్కరించనున్నట్టు చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆ సమస్య పరిష్కారం కాకపోతే కారణాలను కూడ వివరించనున్నట్టు చెప్పారు.కానీ, కార్యాలయాల చుట్టూ తిప్పుకోబోమని చంద్రబాబునాయుడు చెప్పారు.

ఉగాదికి కొత్త కార్డులు
ఉగాదికి కొత్త కార్డులను అందించనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. పథకాల పంపిణీలో వాస్తవ సమాచారం కోసం సాధికార సర్వేను ప్రమాణికంగా తీసుకుంటున్నామన్నారు. మరో సారి సూక్ష్మస్థాయి సర్వే చేయిస్తామని చెప్పారు. జన్మభూమిలో 4లక్షల ఫించనుదార్లను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. వీరందరికీ ఉగాది నుంచి పింఛన్లు ఇస్తామన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications