Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నామినేటెడ్ పదవుల తొలి జాబితా సిద్దం : ఎవరికి ఏ పదవి దక్కిందంటే..

వైసీపీ నేతలు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న నామినేటెడ్ పదవుల తొలి జాబితా సిద్దమైంది. అందులో భాగంగా ఈ సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు విడుదల కానున్నాయి. పరిపాలనా రాజధానిగా విశాఖ ప్రకటించిన ముఖ్యమంత్రి తొలి జాబితాలో విశాఖ నేతలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సామాజిక సమీకరణాలు..స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయించినట్లుగా విశ్వస నీయ సమాచారం. అయితే, ఈ జాబితా తుది విడుదల సమయంలో కొన్ని మార్పులు చేర్పులకు అవకాశం ఉందని చెబుతున్నారు.

 పక్కా సమీకరణాలు పరిగణలోకి..

పక్కా సమీకరణాలు పరిగణలోకి..

జిల్లా యూనిట్ గా సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా మహిళల కు 50 శాతం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక, నామినేటెడ్ పదవుల్లో విశాఖకు తొలి ప్రాధాన్యత 11మందికి చైర్మన్ పదవులను ఖరారు చేసినట్లు సమాచారం. మరి కొంతమందికి డైరెక్టర్ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. మధ్యాహ్నం జీవోలు జారికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో విఎంఆర్ డీఏ చైర్మన్ గా అక్కరమాని విజయనిర్మల ( విశాఖ తూర్పు నియోజకవర్గం) కు కేటాయించగా.. రాష్ట్ర విద్యావిభాగం వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ( విశాఖ పశ్చిమ ) కు ఖరారు చేసినట్లు సమాచారం.

 అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత

అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత

ఇక, నెడ్ క్యాప్ చైర్మన్ గా కేకే రాజు ( విశాఖ ఉత్తరం ) కేటాయించారు. రాష్ట్రమైనారిటీ విభాగం ఛైర్మన్ గా జాన్ వెస్లీ ( విశాఖ దక్షిణం ) కి ఖరారైందని సమాచారం. రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ ఛైర్మన్ గా దాడి రత్నాకర్ ( అనకాపల్లి ) కి కేటాయించారు. కీలకమైన విశాఖ రీజియన్ పెట్రోకారిడార్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ ( విశాఖ ఉత్తరం ) కు ఖరారు చేసినట్లు విశ్వసనీయ ససమాచారం. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవికి కేటాయించారని తెలుస్తోంది.

Recommended Video

    Vizag Steel Plant : కార్మికుల పోరాటం ఉధృతరూపం.. జగన్ సర్కార్ పై ఒత్తిడి..!!
     చివరి నిమిషంలో మార్పులకూ ఛాన్స్

    చివరి నిమిషంలో మార్పులకూ ఛాన్స్

    టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు (నర్సీపట్నం) కు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా అవకాశం కల్పించారు. అదే విధ:గా ..విశాఖ డీసీఎమ్ ఛైర్ పర్సన్ గా పల్లా చినతల్లి ( గాజువాక ) ను ఎంపిక చేసారు. రాష్ట్ర బ్రాహ్మణ విభాగం చైర్మన్ గా సుధాకర్‌ కు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక, విశాఖ డీసీసీబీ ఛైర్మన్ గా సుకుమార్ వర్మ కొనసాగింపు ( యలమంచిలి ) ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. వీటితో పాటుగా మరిన్ని పోస్టులకు సంబంధించి ఈ సాయంత్రం ఉత్తర్వులు వెలువడనున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+