Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NTR: రాజకీయాలను సమూలంగా మార్చిన శక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ, వెంకయ్య నాయుడు కితాబు

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు రాజకీయాలలోని తనకంటూ ఒక విశేషమైన స్థానాన్ని సంపాదించుకున్న మేరునగధీరుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతి నేడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లోని ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ
నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బక్కని నర్సింహులు తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ గురించి, ఆయన రాజకీయ రంగంలోనూ, సినీ రంగంలోనూ చేసిన సేవను గురించి కొనియాడారు.

NTR is a Power That Changed Politics Radically Balakrishna Venkaiah Naidu comments

ఎన్టీఆర్ అంటే ఒక శక్తి; బాలయ్య కితాబు
బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అన్నారు. ఆయన సాధారణ రైతు కుటుంబంలో పుట్టారని, చదువుకు తొలి ప్రాధాన్యత, ఆ తర్వాత సినీరంగంలోకి వచ్చారన్నారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని పేర్కొన్న ఆయన నటనకు విశ్వవిద్యాలయంగా, సినీరంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న తరుణంలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారని, ఒకే పంధాలో వెళుతున్న రాజకీయాలను సమూలంగా మార్చారని తెలిపారు.

రాజకీయాలను సమూలంగా మార్చిన మహనీయుడు ఎన్టీఆర్
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహనీయుడు, ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. అంతకుముందు రాజకీయాలు కొంతమందికే పరిమితమై ఉండేవని, ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత డాక్టర్లు, లాయర్లు, అభిమానులు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు.

ఆయన పెట్టిన పథకాలే నేటికీ
అధికారానికి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు పదవులు కట్టబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రభుత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని, ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పట్టం కట్టారని బాలకృష్ణ కితాబిచ్చారు. ఆయన పెట్టిన పథకాలను ఇప్పటికి కూడా అన్ని పార్టీలు అవలంభిస్తున్నాయి అని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ను స్మరించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆయనను స్మరించుకున్నారు. తెలుగు వారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు అంటూ ఆయన పేర్కొన్నారు.చలనచిత్ర రంగంలో పురాణ పురుషుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అశేష ప్రజానీకాన్ని మెప్పించి, ఇంటింటి ఇలవేల్పుగా నీరాజనాలు అందుకున్నారన్నారు.

ఎన్టీఆర్ గొప్పతనం చెప్పిన వెంకయ్య నాయుడు
ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ నవ శకానికి నాంది పలికి దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని కితాబు ఇచ్చారు. గొప్ప జాతీయ వాది అయిన ఎన్టీఆర్ నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు అంకురార్పణ చేసి, మార్గదర్శిగా నిలిచి మహానేతగా మన్ననలు అందుకున్నారని కొనియాడారు. మహిళలకు ఆస్తి హక్కు, అధికార వికేంద్రీకరణ సహా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన గొప్ప సంస్కరణ వాది ఎన్టీఆర్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+