అవమానం: ఎన్టీఆర్ విగ్రహాన్ని తగులబెట్టిన ఆగంతకులు
ఎన్టీఆర్కు అవమానం జరిగింది. గుంటూరులో ఆయన విగ్రహాన్ని ఆగంతకులు దగ్ధం చేశారు. దీంతో విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది.
గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరంంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తగులబెట్టారు. దీంతో విగ్రహం పైభాగం పాక్షికంగా ధ్వంసమైంది. విగ్రహానికి ఎదురుగా ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని కూడా దుండగులు తగులబెట్టారు.
సంఘటన వివరాలు తెలిసిన వెంటనే తహసీల్దార్ పీసీహెచ్ వెంకయ్య, రూరల్ సీఐ యు శోభన్ బాబు, రూరల్ ఎస్ఐ ఉదయబాబు పోత వరం గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఇప్పటికే కొద్దిమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. రెండురోజుల క్రితం గ్రామంలో టీడీపీకి చెందిన ఫ్లెక్సీని కూడా దుండగులు పాక్షికంగా తగులబెట్టారు.

ఎన్టీఆర్ విగ్రహాల జోలికి వెళితే ప్రజలు వారిని బంగాళఖాతంలో కలుపుతారని మంత్రి పుల్లారావు అన్నారు. పోతవరంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని తగులబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభి వృద్ధిని ఓర్చుకోలేనివారే ఈ ఘటనకు పాల్పడ్డారని వివరించారు.
పోత వరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తగులబెట్టిన సంఘటనకు వైసీపీ నాయకులకు గాని, కార్యకర్తలకు గాని ఎలాంటి సంబంధం లేదని జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications