వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు చంద్రబాబు, పవన్ దొరికిపోయారా ? కొత్త మైండ్ గేమ్ స్టార్ట్ ! అసలు టార్గెట్ ఇదేనా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేబినెట్ ప్రక్షాళనతో పాటు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాల్ని చేపట్టిన వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావం పూరించినట్లే కనిపించారు. దీంతో అప్రమత్తమైన విపక్షాలు టీడీపీ, జనసేన ఉమ్మడి వ్యూహం రచించే పనిలో పడ్డాయి. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకతాటిపైకి తెస్తానని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. అయితే దీనికి కౌంటర్ గా పొత్తుల్లేకుండా మీరు పోటీ చేయలేరా అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు, పవన్ మళ్లీ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది.

 చంద్రబాబు-పవన్ పొత్తు వ్యూహం

చంద్రబాబు-పవన్ పొత్తు వ్యూహం

ఏపీలో మూడేళ్ల వైసీపీ పాలన చూసిన తర్వాత విపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే నష్టపోతామని గ్రహించాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఎవరెలా నష్టపోతారో గత ఎన్నికల ఫలితాలు వారికి రుచి చూపించాయి. దీంతో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి పోటీ వ్యూహానికి తెరలేపారు. పొత్తలు పెట్టుకుని బరిలోకి దిగుతామని సంకేతాలు ఇచ్చేశారు. అప్పటికే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇవ్వడంతో వీరిద్దరూ పొత్తులపై బహిరంగ ప్రకటనలు చేయడం మొదలుపెట్టేశారు. దీంతో ఇప్పుడే వీరిద్దరి మధ్య పొత్తు కుదుతుతుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది.

 వైసీపీ ఎదురుదాడితో సీన్ రివర్స్

వైసీపీ ఎదురుదాడితో సీన్ రివర్స్

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు-పవన్ పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టడంతో వైసీపీ కూడా అప్రమత్తమైంది. తమకు వ్యతిరేకంగా విపక్షాలు పొత్తులతో ముందుకెళితే నష్టం తప్పదని గ్రహించింది. అయితే ఆ నష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకునేందుకు వీలుగా ఎదురుదాడి మొదలుపెట్టింది. పొత్తులు లేకుండా పోటీ చేయలేరా అంటూ చంద్రబాబు, పవన్ ను రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. దీంతో ఇద్దరూ ఆత్మరక్షణలో పడ్డారు. మరోవిధంగా చెప్పాలంటే జగన్ కు వీరిద్దరూ ఈ విషయంలో దొరికిపోయినట్లయింది. అంతే మరో ట్విస్ట్ మొదలైంది.

 చంద్రబాబు-పవన్ కొత్త మైండ్ గేమ్ ?

చంద్రబాబు-పవన్ కొత్త మైండ్ గేమ్ ?


అప్పటివరకూ తామిద్దరూ పొత్తులపై ముందస్తుగానే ప్రకటన చేసేస్తే ఇద్దరికీ ఉపయోగం ఉంటుందని భావించిన చంద్రబాబు-పవన్ వైసీపీ ఎదురుదాడితో షాక్ అయ్యారు. ఎప్పుడో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే పొత్తులు పెట్టుకుంటామని చెప్పుకుని తిరిగితే ప్రయోజనం లేదని ఇద్దరికీ అర్దమైంది. దీంతో మరో కొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎవరికి వారు ప్రభుత్వంపై విడివిడిగానే ఎదురుదాడి చేస్తూ ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఎక్కడా పవన్ చంద్రబాబు పేరు కానీ, టీడీపీ పేరు కానీ ఎత్తకుండా.. అలాగే చంద్రబాబు కూడా పవన్ , జనసేన, పొత్తుల పేరెత్తకుండానే ముందుకెళ్లాలని నిర్ణయించారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు, పవన్ కాదు ఇరు పార్టీల నేతలు కూడా పాతమిత్రుల గురించి మాట్లాడకుండా సొంత వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారు. సరైన సమయంలో పొత్తులపై ప్రకటనలు చేస్తామని ఇరుపార్టీలూ చెప్తున్నాయి.

English summary
after ysrcp's reverse attack on tie up chandrababu and pawan kalyan seems to be changed their future plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X