ఏపీ ప్రజలకు అలర్ట్.. సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయడం హాట్ టాపిక్ గా మారింది. జూన్ 10వ తేదీ (మంగళవారం) రాత్రి వరకు సేవలను నిలిపివేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
సాంకేతిక మార్పుల కారణంగా..
ప్రభుత్వం AP Seva Portal ను ప్రస్తుతం Microsoft Cloud నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్కు (State Data Centre - SDC) మైగ్రేట్ చేస్తోంది. ఈ డేటా మార్పిడి ప్రక్రియ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో కొన్ని ముఖ్యమైన ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు అని అధికారులు వెల్లడించారు.

తాత్కాలికంగా నిలిచే ముఖ్యమైన సేవలు ఏవంటే..?
ఆదాయ ధ్రువీకరణ పత్రం
సమగ్ర ధ్రువీకరణ పత్రం (Integrated Certificate)
భూమి మ్యుటేషన్లు (Land Mutations)
ఇళ్ల స్థలాల దరఖాస్తులు / పట్టాలు
వృద్ధాప్య ధ్రువీకరణ పత్రం
వివాహ ధ్రువీకరణ పత్రం
రేషన్ కార్డు సంబంధిత సేవలు
రెవెన్యూ శాఖ సేవలు (జమాబందీ, పట్టాదారు పాస్బుక్ తదితరాలు)
వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్లు
పట్టణ పరిపాలన శాఖ సేవలు (గ్రీవెన్సులు, లైసెన్సులు, అప్లికేషన్లు మొదలైనవి)
మత్స్య శాఖ సేవలు (ఫిషరీస్ డిపార్ట్మెంట్ లైసెన్సులు/సబ్సిడీలు)
అయితే, ఈ ఆన్లైన్ మార్పుల ప్రభావం అన్ని ప్రభుత్వ సేవలపై ఉండదని.. కొన్ని ఇతర సేవలు - ఆధార్ అప్డేట్స్, బ్యాంక్ సేవలు, పలు కేంద్ర ప్రభుత్వం స్కీములు, నాన్-రెవెన్యూ ఆధారిత సేవలు వంటి కొన్ని సేవలు మీ సేవా కేంద్రాల్లో యథావిధిగా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పనుల కోసం ముందుగానే అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేదా అప్లికేషన్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతరాయం ముగిసిన వెంటనే సేవలు మళ్లీ పూర్వపరిస్థితికి తీసుకువస్తామని వెల్లడించారు. మరింత సమాచారం కోసం https://ap.gov.in/ లేదా గ్రామ సచివాలయం అధికారిక పోర్టల్స్ను సందర్శించవచ్చని వివరించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications