ఫొటో: రేణుకా చౌదరితో ఉస్మానియా విద్యార్థులు
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం ఎఐసిసి అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని కలిశారు. తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్న భద్రచలాన్ని విడిపోకుండా తన వంతు కృషి చేస్తానని ఆమె ఓయు విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఓయు విద్యార్థి జెఎసి నాయకులు రేణుకా చౌదరిని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని విద్యార్థులు నినదించారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్నవారిపై భౌతిక దాడులకు దిగడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. భద్రాచలం దేవస్థానంతో తమకున్న అనుబంధం గురించి విద్యార్థులకు రేణుకా చౌదరి గుర్తు చేశారు.

భద్రాచలం సీమాంధ్రలోకి వెళ్లే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే తాను కేంద్రంలోని పెద్దలతో ఫోనులో మాట్లాడానని ఆమె చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, దాని జాతీయ హోదాకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చూడాలో ఆలోచిస్తామని రేణుకా చౌదరి చెప్పారు.
భద్రచలాన్ని సీమాంధ్రలో కలపాలని ఆ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం దాన్ని తమ రాష్ట్రంలోనే ఉంచాలని కోరుతున్నారు. రేణుకా చౌదరి సీమాంధ్రకు చెందినప్పటికీ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చాలా కాలంగా క్రియాశీలకంగా ఉన్నారు. ఆమె ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కూడా.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications