టిలో జెండా ఎగరాలి: జగన్, షర్మిల ఓదార్పు(పిక్చర్స్)
హైదరాబాద్: 2019లో తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ జెండా ఎగరాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అత్తాపూర్ క్రిస్టల్ గార్డెన్స్లో బుధవారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు.
వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి పోరాడతానని జగన్ అన్నారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే తాను వచ్చి ధర్నా చేస్తానని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. కలిసికట్టుగా ప్రయాణం చేసి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని అన్నారు.
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా పొంగులేటి
తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తన సోదరి షర్మిల సహకరిస్తారని తెలిపారు.
తన తండ్రి వైయస్ కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించాలనే కోరిక ఉందని అన్నారు. ఆ కుటుంబాల వద్దకు సోదరి షర్మిల వెళుతుందని, వారిని పరామర్శిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షర్మిల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వైయస్ జగన్
2019లో తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ జెండా ఎగరాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కొమురం భీంకు నివాళి
అత్తాపూర్ క్రిస్టల్ గార్డెన్స్లో బుధవారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు.
చిన్నారికి పలకరింపు
వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి పోరాడతానని జగన్ అన్నారు.
సదస్సులో కార్యకర్తలు
ప్రజలకు ఏదైనా సమస్య వస్తే తాను వచ్చి ధర్నా చేస్తానని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.
నేతల
కలిసికట్టుగా ప్రయాణం చేసి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని అన్నారు.
వైయస్ జగన్
తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రకటించారు.
వైయస్ జగన్
పార్టీ కార్యక్రమాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తన సోదరి షర్మిల సహకరిస్తారని తెలిపారు.
సదస్సు
తన తండ్రి వైయస్ కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించాలనే కోరిక ఉందని జగన్ అన్నారు.
షర్మిల
ఆ కుటుంబాల వద్దకు సోదరి షర్మిల వెళుతుందని, వారిని పరామర్శిస్తుందని జగన్ తెలిపారు.