వివాహేతర సంబంధం: పొలిమేరల్లో దాడి, వ్యక్తి మృతి
విజయవాడ: అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తిన హతమార్చిన ఘటన కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని నదిసాగీ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అమరేశ్ గౌడ్ వయసు 30 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఓ మహిళతో వివహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
రెండు నెలలు క్రితం ఆమెను బెంగుళూరుకు తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసిన ఆ మహిళ బంధువులు వారిద్దరిని బెంగుళూరు నుంచి తీసుకొచ్చి గ్రామంలోని పొలిమేరల్లో దాడి చేశారు. ఈ ఘడనలో అమరేశ్ గౌడ్ మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ మహిళను హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అంగన్ వాడీ కార్యకర్తపై బెజవాడలో అత్యాచారం
అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఓ మహిళపై విజయవాడలో అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితమే ఈ ఘటన చోటుచేసుకోగా, ఆదివారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.