కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహేతర సంబంధం: పొలిమేరల్లో దాడి, వ్యక్తి మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తిన హతమార్చిన ఘటన కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని నదిసాగీ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అమరేశ్ గౌడ్ వయసు 30 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఓ మహిళతో వివహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

రెండు నెలలు క్రితం ఆమెను బెంగుళూరుకు తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసిన ఆ మహిళ బంధువులు వారిద్దరిని బెంగుళూరు నుంచి తీసుకొచ్చి గ్రామంలోని పొలిమేరల్లో దాడి చేశారు. ఈ ఘడనలో అమరేశ్ గౌడ్ మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ మహిళను హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Over an affair: Man shot dead

అంగన్ వాడీ కార్యకర్తపై బెజవాడలో అత్యాచారం

అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఓ మహిళపై విజయవాడలో అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితమే ఈ ఘటన చోటుచేసుకోగా, ఆదివారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Man dead in Kurnool district due to Over an affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X