చితకొట్టిన పోలీసులు, ఒకరు మృతి... మొండెం వదిలి తలను తీసుకెళ్లారు
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. టికెట్ లేదన్న కారణంతో 13 మంది ప్రయాణికులను రైల్వే పోలీసులు చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు.
మృతి చెందిన ప్రయాణికుడిని కర్నూలుకు చెందిన వెంకటేశ్ (29)గా గుర్తించారు. వలస కూలీగా జీవనం సాగిస్తున్న వెంకటేశ్ కర్నూలు నుంచి గుంటూరుకు వెళుతున్న క్రమంలో పోలీసుల చేతిలో మరణించాడు. కాగా మృతుని భార్య రైల్వేస్టేషన్ బుకింగ్ హాల్ వద్ద ఆందోళనకు దిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లాలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య

కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బండి ఆత్మకూరు మండలం కోడూరులో ఏపీఎస్పీ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. వెంకటేశ్వర్లును తల నరికి హత్య చేసిన దుండగులు మొండెం వదిలి తలను తీసుకెళ్లారు. ఏపీఎస్పీ తొమ్మిదో బెటాలియన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు ఈ నెల 12న అదృశ్యమయ్యాడు.
సెలవుల కోసమని కర్నూలు వచ్చిన వెంకటేశ్వర్లు తిరిగి వెళుతున్న క్రమంలో అదృశ్యమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ హత్యకు పాల్పడిందెవరన్న విషయంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications