రేపు అమరావతికి పన్నీర్ సెల్వం: చంద్రబాబుతో భేటీ కోసం..
తెలుగు గంగ పథకం కింద చెన్నై తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను విడుదల చేయాల్సిందిగా పన్నీర్ సెల్వం చంద్రబాబును కోరనున్నారు.
విజయవాడ: కృష్ణా జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై చంద్రబాబును ప్రత్యక్షంగా కలిసి సమస్య గురించి వివరించబోతున్నారు పన్నీర్ సెల్వం.
ఇందుకోసం ఆయన నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు. రాజధానిలోని సచివాలయ ప్రాంగణంలో పన్నీర్ సెల్వం చంద్రబాబుతో భేటీ అవనున్నారు. తెలుగు గంగ పథకం కింద చెన్నై తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను విడుదల చేయాల్సిందిగా పన్నీర్ సెల్వం చంద్రబాబును కోరనున్నారు.

అంతకుముందు లేఖ..
జనవరి 5వ తేదీకి కండలేరు రిజర్వాయర్లో 13.53టీఎంసీల నీటి నిల్వ ఉందని, కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చెన్నైకి నీటిని విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications