టీడీపీ సంక్షేమ నిధిగా: 'ఆ అవీనితి పాపం చంద్రబాబుదే'
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీలో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని అన్నారు.
సోమవారం వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలను లూటీ చేసి టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని ఆయన అన్నారు. ఉచిత ఇసుక పాలసీలో అవినీతికి తావు లేకుండా ఉచితంగానే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జన్మభూమి కమిటీలతో గ్రామాల్లోని అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్యానించారు. జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆ అవినీతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులో టీడీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఎస్డీఎఫ్ను, టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేశారని దుయ్యబట్టారు. ఓడిపోయిన వారికి, టీడీపీ కార్యకర్తలకు వందల కోట్లు కేటాయించే అధికారం సీఎంకు ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల పేరు మీద జీవోలు ఇచ్చి నిధులు కేటాయించడం సరికాదని అన్నారు.
దీనిపై చంద్రబాబు విచారణ జరిపి పక్షపాతధోరణితో కేటాయించిన నిధులను వెంటనే నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలకు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications