పాపను కారులో మరచి దైవ దర్శనానికి వెళ్ళిన తల్లిదండ్రులు; తిరిగి వచ్చేసరికి..
ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నది మరచి తమకేమి పట్టదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటన నంద్యాల జిల్లా మహానందిలో చోటుచేసుకుంది. ఒక చిన్నారిని తల్లిదండ్రులు కారులో మరిచిపోయి మహానందిలోని ఆలయానికి దర్శనానికి వెళ్లారు. కారులో నిద్రిస్తున్న చిన్నారి ఊపిరాడక ఏడవడం ప్రారంభించింది. భార్యాభర్తల మధ్య సమన్వయలోపం చిన్నారిని కారులోనే మరిచిపోయి వెళ్లేలా చేసింది.
పసిపాపను కారులోనే వదిలేసి దైవ దర్శనానికి
కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ కు చెందిన రాజు తన భార్య పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కారులో మహానంది క్షేత్రానికి దైవదర్శనం కోసం వెళ్ళాడు. రాజు తమ వాహనాన్ని నంది సర్కిల్లో పార్క్ చేశారు. భర్త పాపను తీసుకు వస్తాడని భావించిన భార్య కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళింది. ఇక భార్య పాపను తీసుకు వెళ్లిందని భావించిన భర్త పాపను కారులోనే వదిలేసి వెళ్లాడు.

కారులో ఊపిరాడక ఏడ్చిన పాప
ఇద్దరు వేరువేరుగా దైవదర్శనానికి వెళ్లారు. దీంతో చిన్నారి కారులోనే ఉండిపోగా అద్దాలు క్లోజ్ ఉండి, కారు లాక్ పడడంతో చిన్నారికి నిద్ర నుండి మెలకువ వచ్చింది. ఊపిరాడక చిన్నారి కారులోని ఏడుస్తూ ఉండడం గమనించిన స్థానికులు దేవస్థానంలోని సమాచార కేంద్రంలో ఉన్న ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలిపారు. వారు కానిస్టేబుల్ చంద్రశేఖర్ కు ఈ విషయం చెప్పడంతో వెంటనే ఆయన కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని బయటకు తీశాడు.
పసిపాపను కాపాడిన కానిస్టేబుల్
అప్పటికే పాప ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. పాపను సమాచార కేంద్రంలో సపర్యలు చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇక ఈ సంఘటనలో కానిస్టేబుల్ వెంటనే ప్రతిస్పందించడం వల్ల ఓ పసిపాప ప్రాణాలు దక్కాయి. దేవస్థానం సిబ్బంది తల్లిదండ్రులను వెంటనే వచ్చి పాపను తీసుకు వెళ్లవలసిందిగా మైక్ లో చెప్పిన పావుగంట తర్వాత తల్లిదండ్రులు వచ్చి పాపను తీసుకువెళ్లారు.
కానిస్టేబుల్ వచ్చి పాపను కాపాడకపోయి ఉంటే
ఈ సంఘటనలో చంటి పాప పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రుల తీరుపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి కానిస్టేబుల్ వచ్చి కాపాడక పోయి ఉంటే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు .చిన్నపిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని అడుగుతున్నారు.
నంద్యాల జిల్లా మహానందిలో చిన్నారి ప్రాణం కాపాడేందుకు సమయస్ఫూర్తి ప్రదర్శించిన మహానంది పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ (PC 235)కు అభినందనలు.కర్ణాటక బీజీపూర్ కు చెందిన కుటుంబం ఏడాది వయసున్న శిశువును కారులో వదిలి దేవాలయంలోకి వెళ్లారు. కారులో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న… pic.twitter.com/dgV469MenW
— Anitha Vangalapudi (@Anitha_TDP) August 17, 2025
కానిస్టేబుల్ ను అభినందించిన హోం మంత్రి అనిత
ఇక ఈ సంఘటన తెలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మహానందిలో చిన్నారి ప్రాణం కాపాడిన మహానంది పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ ను అభినందించారు. ఎక్స్ వేదికగా ఆమె పాప ప్రాణాలను కాపాడడానికి చొరవ చూపిన కానిస్టేబుల్ ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు అంటూ ట్వీట్ చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications