బిజెపి వైపు పరిటాల సునీత: వెంకయ్యతో చర్చలు!
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే పరిటాల సునీత పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బిజెపిలో చేరే విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో చర్చలు జరిపినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
అనంతపురం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి, అతని సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైన కారణంగానే పరిటాల సునీత టిడిపిని వీడుతున్నట్లు తెలుస్తోంది. జెసి దివాకర్ రెడ్డి సోదరుల రాకను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిటాల సునీత టిడిపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

జెసి సోదరుల రాకను పరిటాల సునీత వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయినా పార్టీ అధినేత వారిని పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తి చేసినట్లు తెలియడంతో ఆమె టిడిపికి దూరంగా ఉండాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. జెసి వర్గంపై పరిటాల సునీత వర్గానికి ఎప్పట్నుంచో వ్యతిరేకత ఉంది. తన భర్త, జిల్లా టిడిపి నాయకుడు పరిటాల రవిని హత్య చేయించింది కూడా జెసి వర్గమేనని పరిటాల సునీత వర్గం భావిస్తోంది.
జెసి సోదరులు పార్టీలోకి రాకముందే వర్గాలను తయారు చేస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఇక పార్టీలో చేరితే వారి ఫ్యూడల్ పోకడలతో టిడిపిలో ఎవరూ మనుగడ సాగించలేరని సునీత వాపోయినట్లు తెలిసింది. గతంలోనే జెసి సోదరులను టిడిపిలో చేర్చుకోవద్దని చంద్రబాబుకు సునీత స్పష్టం చేసింది. జెసి సోదరులు టిడిపిలో చేరిన తర్వాత సునీత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
పరిటాలకు భయపడి పారిపోయారు: జెసి సోదరులపై అనంత
దివంగత టిడిపి నేత పరిటాల రవికి భయపడి గతంలో జెసి దివాకర్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డిలు పారిపోయారని ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇప్పుడు వారే తెలుగుదేశం పార్టీలో చేరుతుండటం సిగ్గు చేటని అన్నారు. తాము మార్చి 23న టిడిపిలో చేరుతున్నట్లు జెసి దివాకర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన గురువారం తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ.. జెసి సోదరులకు భయపడి ఓటేయడం మానకూడదని ప్రజలకు తెలిపారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర అనలేని పిరికిపంద అని అనంత ఆరోపించారు. చంద్రబాబు ద్వంద్వ నీతే విభజనకు కారణమని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్లే మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన సాధ్యమవుతుందని అనంత తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications