దమ్మూ ధైర్యం ఉందా: చంద్రబాబును ఏకేసిన పార్థసారథి
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వానికి దమ్మూ ధైర్యం ఉంటే ఆదాయవ్యయాలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అందుకు సిద్ధపడాలని ఆయన అన్నారు.
హైదరాబాదు నుంచి కట్టుబట్టలతో అమరావతికి పంపేశారంటున్న చంద్రబాబు వందల కోట్లు ఆడంబరాలకు ఖర్చు చేస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. మాయమాటలు, అబద్ధాలు చెప్పి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.

ఖజానా ఖాళీ అయిందని అంటూనే ఆడంబరాలకు అడ్డగోలుగా ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలకు కోతలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలపై ఆర్టీసి చార్జీల భారం మోపారని అన్నారు. ప్రజలకు వాస్తవ ఆర్థిక పరిస్థితులు వివరించాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ నాయకులకు వందల కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చామని చంద్రబాబు అన్న విషయం తెలిసిందే. తాను ఇంకా హైదరాబాదులోనే ఉంటే ప్రజల తీర్పును అవమానించినట్లు అవుతుందని కూడా ఆయన అన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications